ఎన్టీఆర్-బుచ్చిబాబు సినిమాకు టైటిల్ ఇదేనా.. గురువుదారిలో ఉప్పెన డైరెక్టర్..?

  • IndiaGlitz, [Wednesday,February 02 2022]

ఆర్ఆర్ఆర్ కారణంగా దాదాపు మూడేళ్ల పాటు అభిమానులకు దూరమయ్యారు. ఇంత ఎదురుచూసినప్పటికీ ఆర్ఆర్ఆర్ మాత్రం రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ మరింత నిరాశకు గురవుతున్నారు. అయితే ఇటీవల వారికి గుడ్‌న్యూస్ చెప్పారు ఆర్ఆర్ఆర్ మేకర్స్. మార్చి 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కూడా సినిమాల విషయంలో స్పీడ్ పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివతో తన 30వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు యంగ్ టైగర్. అలాగే ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలోనూ మరో సినిమాకు ఎన్టీఆర్ కమిట్ అయ్యారు.

1980 నేపథ్యంలో పీరియాడికల్‌గా సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. పుష్ప సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌లో వున్న మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఎన్టీఆర్ మూవీని నిర్మించనున్నారు. తాజాగా ఈ సినిమాకి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ మూవీకి 'పెద్ది' అనే టైటిల్ ఖరారైనట్లుగా ఫిలింనగర్ టాక్. టైటిల్ డిఫరెంట్ గా ఉండడంతో ఎన్టీఆర్ కి కూడా నచ్చిందని సమాచారం. ఈ మూవీలో ఎన్టీఆర్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించబోతున్నారట.

అంతేకాదు.. గురువు సుకుమార్ బాటలోనే హీరోకి ఏదో ఒక లోపం పెట్టాలని బుచ్చిబాబు భావిస్తున్నారట. రంగస్థలంలో రామ్‌చరణ్‌కి వినికిడి లోపం, పుష్పలో అల్లు అర్జున్‌కి గుని సమస్యను పెట్టి సక్సెస్ కొట్టారు సుకుమార్. మరి ఎన్టీఆర్‌కు బుచ్చిబాబు ఎలాంటి ఆరోగ్య సమస్యను పెడతారా చూడాలి. అయితే బుచ్చిబాబు సినిమా కంటే ముందే కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్.. మరి ఈ రెండింటిలో ఏ మూవీని ముందు మొదలుపెడతారో చూడాలి.

More News

ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశ... ఎన్టీఆర్- కొరటాల ఓపెనింగ్‌ వాయిదా...?

సినీ పరిశ్రమకు గత కొంతకాలంగా టైం బాగున్నట్లు లేదు. కోవిడ్, లాక్‌డౌన్ సమస్యలకు తోడు ప్రభుత్వాల జోక్యంతో చిత్ర పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తోందన్న

'రావణాసుర' సెట్‌లో అడుగు పెట్టిన రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న `రావణాసుర` సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో సుశాంత్, ఇతర తారాగణం

పెళ్లి కాని ప్రసాద్ కథతో విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటోన్న 'అశోకవనంలో అర్జున కళ్యాణం' టీజర్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమాల విషయంలో దూకుడు పెంచారు. 'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్', 'హిట్', 'పాగల్' వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ సేన్ ప్రస్తుతం..

అజిత్ వాలిమై కొత్త రిలీజ్ డేట్.. పవన్ బరిలోకి దిగితే కష్టమే..!!

ఏ సినిమా చేసినా ప్రాణం పెట్టి చేయడం అజిత్ స్టైల్. తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకడిగా వున్నా... నేటికీ ఆయనలో అదే క్రమశిక్షణ, పట్టుదల. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్‌ చిత్రం ‘వాలిమై’.

విఘ్నాలు దాటుకుని.. ఫిబ్రవరి 18ని లాక్ చేసిన ‘'సన్ ఆఫ్ ఇండియా'

హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, నిర్మాతగా, విద్యావేత్తగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంచు మోహన్ బాబు. అడపా దడపా గెస్ట్ రోల్స్ చేయడమే తప్పించి..