మ‌ణిర‌త్నం బాట‌లో సుకుమార్‌..?

తెలుగు చిత్ర‌సీమ‌లో నేటిత‌రం బెస్ట్ డైరెక్ట‌ర్స్‌లో సుకుమార్ ఒక‌రు. ‘రంగ‌స్థ‌లం’ త‌ర్వాత అల్లు అర్జున్‌తో ‘పుష్ప‌’ అనే ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కానేలేదు. అయితే లాక్‌డౌన్ వ‌ల్ల వ‌చ్చిన గ్యాప్‌ను సుకుమార్ వేస్ట్ చేయ‌డం లేద‌ట‌. ఒక‌వైపు ఉప్పెన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేశారు. అంతే కాదండోయ్‌.. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ఓటీటీ ట్రెండ్‌కు త‌గిన విధంగా వెబ్‌సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నార‌ట సుకుమార్‌. అయితే ఏదో రెగ్యుల‌ర్ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించాల‌నే త‌ర‌హాలో కాకుండా త‌న‌దైన స్టైల్లో డిఫ‌రెంట్ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేశార‌ట సుకుమార్‌. తొమ్మిది ల‌వ్‌స్టోరీస్‌తో సుకుమార్ ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తార‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ వెబ్ సిరీస్‌లో తొమ్మిది మంది హీరోలు న‌టిస్తే.. తొమ్మిది మంది ద‌ర్శ‌కులు దీన్ని తెర‌కెక్కిస్తార‌ని టాక్‌. ఈ వెబ్ సిరీస్‌ను ఓ ప్ర‌ముఖ సంస్థ‌తో క‌లిసి సుకుమార్ నిర్మిస్తార‌ని స‌మాచారం.

అయితే ఇదే పంథాలో వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించ‌డానికి ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్న ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టేశారు. ఆయ‌న ‘నవరస’ అనే పేరుతో వెబ్ సిరీస్ చేయనున్నారు. ఇందులోనూ తొమ్మిది మంది హీరోలు న‌టిస్తే.. తొమ్మిది మంది ద‌ర్శ‌కులు డైరెక్ట్ చేస్తార‌ట‌. చూస్తుంటూ మ‌ణిర‌త్నం, సుకుమార్ ఐడియాల‌జీ ఒకేలా అనిపిస్తుంది.