బ‌యోపిక్‌లో ప‌వ‌న్‌..  ఏది నిజ‌మప్పా?

  • IndiaGlitz, [Friday,December 27 2019]

ప‌వ‌ర్‌స్టార్, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌చ్చే ఏడాది 2020లో సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌నే సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క్యాంప్‌ను ఎలా క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు కానీ.. ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు మాత్రం ప‌వ‌న్ ఎంట్రీ ఉంటుంద‌ని చెబుతూనే స‌ర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో బిజీగా ఉంటున్న ప‌వ‌న్ కొన్ని రోజుల పాటు రాజ‌కీయాల నుండి బ్రేక్ తీసుకోనున్నార‌ట‌. ముందుగా బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్‌లో న‌టిస్తారు. ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, బోనీ క‌పూర్ నిర్మిస్తున్నారు.

కాగా సీనియ‌ర్ నిర్మాత ఎ.ఎం.ర‌త్నం మ‌రో చిత్రాన్ని నిర్మించ‌బోతుండ‌గా, డిఫ‌రెంట్ సినిమాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తార‌ట‌. మొఘ‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమాలో ప‌వ‌న్ దొంగ పాత్ర‌లో న‌టిస్తాడ‌ని కొన్ని వార్త‌లు వినిపించాయి. తాజాగా మ‌రో క‌థ విన‌ప‌డుతుంది. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బ‌యోపిక్‌లో ప‌వ‌న్ న‌టిస్తాడ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌, రానాల‌తో టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బ‌యోపిక్ రూపొందాల్సింంది. ఎందుకనో ఆ ప్రాజెక్ట్ మెటీరియ‌లైజ్ కాలేదు. ఇప్పుడు ప‌వ‌న్ న‌టిస్తాడ‌ని అంటున్నారు. మ‌రి దీనిపై ప‌వ‌న్ క్యాంప్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

More News

ఎస్‌బీఐ యూజర్స్‌కు గుడ్ న్యూస్.. ఇక మోసాలకు చెక్!

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాన్ని పనికొచ్చే పనులకంటే.. చిల్లర పనులకు పాల్పడుతూ మోసాలకు తెగ పాల్పడుతున్నారు.

ఆ విష‌యంలో ర‌ష్మిక కంటే త‌మ‌న్నానే బెట‌రా!

ప్ర‌తి టైమ్‌లో స్టార్ హీరోయిన్స్ మ‌ధ్య కోల్డ్ వార్ సినిమాల రూపంలో జ‌రుగుతూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ స‌మంత‌, కీర్తిసురేష్‌, త‌మ‌న్నా,

డ‌బ్బింగ్ పూర్తి చేసిన మ‌హేశ్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టిస్తోన్న 26వ చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`.  దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో

విజయసాయి మాటకు లెక్కలేకుండా పోయిందా!?

నవ్యాంధ్ర మూడు రాజధానులపై ఎంపీ విజయసాయిరెడ్డి ఓ మాట.. తాజాగా మంత్రి పేర్ని నాని మరో మాట చెప్పారు.

సీబీఐ రంగంలోకి దిగితే వైసీపీ, టీడీపీ నేతల పరిస్థితేంటి!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ వర్సెస్ టీడీపీ అధినేత చంద్రబాబుగా పరిస్థితులు మారనున్నాయా..?.