నాగ్ నెక్ట్స్ మూవీ ఓకే అయిన‌ట్లేనా?

  • IndiaGlitz, [Monday,June 15 2020]

అగ్ర క‌థానాయ‌కుల్లో కింగ్ నాగార్జున ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. సినిమాల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వంలో ‘వైల్డ్ డాగ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. దీని తర్వాత నాగార్జున మరో సినిమా చేయడానికి ఓకే అన్నాడ‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌పడుతున్నాయి. వివరాల్లోకెళ్తే.. రాజ‌శేఖ‌ర్‌తో పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన ప్ర‌వీణ్ స‌త్తారు చాలా గ్యాప్ త‌ర్వాత మ‌రో సినిమాను ట్రాక్ ఎక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

అందులో భాగంగా ఓ క‌థ‌ను సిద్ధం చేసుకుని నాగార్జున‌ని క‌లిశాడ‌ట‌. నాగ్‌కి క‌థ న‌చ్చ‌డంతో ఆయ‌న వెంట‌నే ఓకే చెప్పేశార‌ని టాక్. మ‌రి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంద‌నే దానిపై క్లారిటీ రాలేదు. మ‌రో ప‌క్క తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్‌కు కూడా నాగార్జునే వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడ‌ట‌.

More News

సురేంద‌ర్ రెడ్డి ఎటు వైపు మొగ్గుతాడు?

ద‌ర్శ‌కుడిగా ప‌దిహేనేళ్ల కెరీర్ ఉంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది మాత్రం తొమ్మిది సినిమాలు మాత్ర‌మే..

బ్రేక్ తీసుకున్న త్రిష‌

డ‌స్కీ బ్యూటీ త్రిష బ్రేక్ తీసుకోవాల‌నుకుంటుది. అస‌లు ఇంత‌కూ త్రిష ఎందుకు బ్రేక్ తీసుకోవాల‌ని అనుకుంటుంది?

అనుష్క ఎమోష‌న‌ల్ పోస్ట్‌

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోన్న అనుష్క శెట్టి త‌న నిశ్శ‌బ్దం సినిమా విడుద‌ల కోసం వేచి చూస్తుంది.

పాటలే ముందు అంటోన్న ‘పుష్ప’

ఈ ఏదాది సంక్రాందిలో అల వైకుంఠపురములో చిత్రంతో భారీ హిట్ సాధించాడు.

‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ షాకిచ్చాడా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. దాదాపు 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.