close
Choose your channels

KCR: కేసీఆర్ ప్రసంగాల్లో పస తగ్గిందా..? జనాలను ఆకట్టుకోవడం లేదా..?

Tuesday, November 21, 2023 • తెలుగు Comments
KCR
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేసీఆర్ ప్రసంగాల్లో పస తగ్గిందా..? జనాలను ఆకట్టుకోవడం లేదా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వాగ్ధాటితో ప్రజలను ఆకట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక ఎన్నికల ప్రచారంలో అయితే ఆయన ఉపన్యాసాలు ఉరకెత్తిస్తాయి. ప్రత్యర్థి పార్టీలపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ ఉంటారు. అలాంటి కేసీఆర్ ప్రసంగాల్లో ప్రస్తుతం వాడి తగ్గిందనే విమర్శలు వినిపిస్తు్న్నాయి. కేసీఆర్ ప్రసంగాల్లో పస తగ్గిందని.. నిస్తేజంగా సాగుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అన్ని పార్టీల కంటే ముందే ఏకంగా 115 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించి ఆశ్చర్యపరిచారు. అప్పుడు కచ్చితంగా ఈసారి 100-110 సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ప్రసంగాల్లో పస తగ్గిందా..? జనాలను ఆకట్టుకోవడం లేదా..?

ఇటీవలి ప్రసంగాల్లో బేలతనం..!

కానీ ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యాక ఆ విశ్వాసం సన్నగిల్లుతోందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 100కి పైగా సీట్లు గెలుస్తామని ధీమా చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు 80 సీట్లు కచ్చితంగా గెలుస్తామని చెప్పడమే ఇందుకు ఉదహరణగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అంటూ జాతీయ పార్టీగా మార్చడంతో సెంటిమెంట్ రగల్చడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇటీవల నిర్వహించిన స‌భ‌ల్లో.. "ఓడిస్తే ఏం చేస్తం.. రెస్ట్ తీసుకుంటం.. న‌ష్టపోయేది మాత్రం తెలంగాణ ప్రజ‌లే.. అంటూ బేల‌త‌నం ప్రద‌ర్శించార‌ని ప‌రిశీల‌కులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ఓ సభలో 'హౌలే' అంటూ సొంత కార్యకర్తలను తిట్టడం.. ఎన్నికలు అన్నాక ఎవ‌రో ఒక‌రు గెలుస్తారు.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాల‌ని చెబుతుండంటం ఆయనలోని అసహనాన్ని తెలియచేస్తుందంటున్నారు.

కేసీఆర్ ప్రసంగాల్లో పస తగ్గిందా..? జనాలను ఆకట్టుకోవడం లేదా..?

ప్రధాని మోదీపై నాటి విమ్శరలేవి..?

ముఖ్యంగా గత ఆరు నెలల ముందు దాకా అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల వరకు ప్రధాని మోదీపై ఒంటికాలిపై విమర్శలు గుప్పించేవారు. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో విమర్శలు లేకపోగా.. కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా మాత్రమే విమర్శలు చేస్తున్నారు. దీంతో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందనే వాదనలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయాయని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా కనపడుతూ ఉండటంతో తుది దశ ప్రచారంలో మళ్లీ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ఓట్లు కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

కేసీఆర్ ప్రసంగాల్లో పస తగ్గిందా..? జనాలను ఆకట్టుకోవడం లేదా..?

ప్రస్తుతం కేసీఆర్ ప్రసంగాలు చూస్తే కేవలం నాలుగైదు అంశాల‌పైనే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీని తిట్టడం.. కరెంట్, రైతు బంధు, ఓటు ప్రాధాన్య వంటి అంశాల గురించే ప్రస్తావిస్తున్నారు. దీంతో ఒకప్పుడు కేసీఆర్ ప్రసంగాల కోసం వేయికళ్లతో ఎదురుచూసే జనాలు.. ఇప్పుడు బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారనే స్థాయికి వచ్చేశారని అంటున్నారు. మొత్తానికి ఒకప్పటి వాక్చాతుర్యం కేసీఆర్‌లో కొరవడిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment