బోయ‌పాటి నెక్ట్స్ మూవీలో అత‌ను న‌టిస్తున్నాడా..

  • IndiaGlitz, [Saturday,June 18 2016]

స‌రైనోడు సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించిన బోయ‌పాటి శ్రీను నెక్ట్స్ మూవీని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేస్తున్నారు. ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఈ చిత్రంలో ఇద్ద‌రు స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. అందులో ఒక‌రు వెంక‌టేష్ అని ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఇదిలా ఉంటే... స‌రైనోడు సినిమాలో విల‌న్ గా న‌టించిన ఆది పినిశెట్టి ఈ చిత్రంలో కూడా న‌టిస్తున్నాడ‌ట‌. బోయ‌పాటి నెక్ట్స్ మూవీలో న‌టించాలి అన‌గానే ఆది ఓకే చెప్పాడ‌ట‌. అయితే స‌రైనోడులో ఆదిని స్టైలీష్ విల‌న్ గా చూపించిన బోయ‌పాటి ఈసారి ఎలా చూపిస్తాడో చూడాలి. ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. జులైలో షూటింగ్ ప్రారంభించ‌నున్న ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్నారు.