బాల‌య్య కూడా రెడీ అన్నాడా..?

  • IndiaGlitz, [Tuesday,October 06 2020]

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మూడో మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన 'సింహా', 'లెజెండ్' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలే. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయ్యింది. వీలైనంత త్వరగా బాలయ్య సినిమాను పూర్తి చేసేయాలనుకుంటే కరోనా వైరస్‌ అడ్డం పడింది. కోవిడ్‌ ఎఫెక్ట్‌తో దాదాపు ఆరునెలల పాటు సినిమా షూటింగ్ ఆగిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే నాగార్జున‌, చైత‌న్య వంటి స్టార్స్ సెట్స్‌పైకి వెళ్లిపోయారు. మిగిలిన‌ స్టార్స్ కూడా వారి సినిమాలను స్టార్ట్ చేస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడు బాల‌కృష్ణ కూడా త‌న 106 కోసం సెట్స్‌పైకి వెళ్ల‌డానికి ఓకే అన్నాడ‌ట‌. న‌వంబ‌ర్ నుండి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని, అందుకోసం యూనిట్ స‌భ్యులు లొకేష‌న్స్ సెర్చ్ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో బాల‌కృష్ణ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. అందులో ఓ పాత్ర అఘోరా పాత్ర అని స‌మాచారం. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా ప్రోమోలో బాల‌య్య ఓ లుక్‌లో ఎలా ఉంటాడ‌నేది తెలిసింది. ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్ర‌మిది. దసరా సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

More News

జనసేనానిని కలిసిన సుదీప్.. ఆసక్తికర విషయం ఏంటంటే..

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారితో ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు.

వైద్యుల మాట వినకుండానే ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారట..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చికిత్స పొందుతున్న వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

థియేటర్స్ కు కేంద్ర ప్రభుత్వం సూచించిన నిబంధనలు...

కోవిడ్‌ ప్రభావంతో సినిమా రంగం కుదేలైంది. ఆరు నెలలు థియేటర్స్‌ మూతపడ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి.

పుకార్లకు క్లారిటీతో చెక్‌ పెట్టిన శృతిహాసన్‌

రీసెంట్‌గా శ్రుతి హాసన్‌ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. దాని తర్వాత శ్రుతి హాసన్‌ దక్షిణాది సినిమాలను తక్కువగా మాట్లాడిందంటూ వార్తలు వినిపించాయి.

పెళ్లి తేదీ చెప్పేసిన కాజల్ అగర్వాల్

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ముంబైకి చెందిన బిజినెస్‌మేన్‌ గౌతమ్‌ కిచ్లుని పెళ్లి చేసుకోనుందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.