ఎమోషనల్ ట్వీట్..
- IndiaGlitz, [Thursday,April 04 2019]
ఏడాది కాలంగా లండన్లో న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్కి చికిత్స తీసుకుంటున్న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ముంబై చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ ఫీలింగ్స్ను ట్వీట్ చేశారు. ''బహుశా జీవితంలో గెలవాలనే తాపత్రయంలో మనల్ని ప్రేమిస్తున్న, అభిమానిస్తు్న వారిని గుర్తు పెట్టుకోం.
కానీ జీవితంలో మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు వారు గుర్తుకు వస్తారు. అలా సాగిపోయే నా జీవితంలో నన్ను ప్రేమించిన, అభిమానించిన వారందరికీ థాంక్స్. మీ ప్రేమ, అభిమానమే నన్ను కోలుకునేలా చేశాయి. మళ్లీ మీ ముందుకు రాబోతున్నాను'' అని ఈ ట్వీట్ ద్వారా తెలిపారు ఇర్ఫాన్ ఖాన్. ఈయన ఇప్పుడు 'హిందీ మీడియం సీక్వెల్'లో నటించబోతున్నారని సమాచారం.