అగ్ర హీరోలు.. ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్స్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఆర్ఆర్ఆర్ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం.. ప‌వ‌న్ రీ ఎంట్రీ మూవీ పింక్ రీమేక్ కాగా.. మ‌రో చిత్రం ప్ర‌భాస్ పాన్ ఇండియా చిత్రం. ఈ మూడు సినిమాలు సెట్స్‌పై శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటున్నాయి.

చిరంజీవి:

చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. త్రిష హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా దేవ‌దాయ శాఖ‌లో అవినీతిని తెలియ‌జేసే చిత్రం. యూనివర్స‌ల్ పాయింట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో నటిస్తున్నాడట‌. ఈ చిత్రానికి 'ఆచార్య‌' అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించిన‌ట్లు స‌మాచారం.

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌:

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల త‌ర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా దిల్‌రాజు, బోనీ క‌పూర్ నిర్మాత‌లుగా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ చిత్రం 'పింక్‌'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ లాయ‌ర్ పాత్ర‌ను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి వ‌కీల్‌సాబ్ అనే టైటిల్ రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు టాక్‌. మే 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ప్ర‌భాస్‌:

'బాహుబ‌లి'తో నేష‌న‌ల్ రేంజ్ హీరో అయిన ప్ర‌భాస్‌..సాహోతో ఆ రేంజ్ స‌క్సెస్‌ను సొంతం చేసుకోలేక‌పోయాడు. ఇప్పుడు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మేకింగ్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని చేస్తున్నాడు ప్ర‌భాస్‌. ఈ సినిమాకు ముందుగా జాన్ అనే టైటిల్‌ను పెట్టాల‌నుకున్నప్ప‌టికీ.. 96 రీమేక్‌కు జాను అనే టైటిల్‌ను పెట్ట‌డంతో ఇప్పుడు ప్ర‌భాస్ త‌న సినిమాకు ఓ డియ‌ర్‌, రాధే శ్యామ్ అనే టైటిల్స్ పరిశీల‌న‌లో ఉన్నాయ‌ట‌.

More News

కీర్తి సురేష్  నటించిన 'మిస్ ఇండియా 'కొత్తగా కొత్తగా' పాట విడుదల

‘మహానటి’తో జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డుని ద‌క్కించుకున్న కీర్తిసురేశ్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్ ఇండియా. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో

చిరు సుప్రీం.. ఆయనకు అలాంటి పదవులేం అక్కర్లేదు..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా.. పెద్దన్న ఉంటూ ఎలాంటి సమస్యలు తన దృష్టికి వచ్చినా పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు.

పవన్ కల్యాణ్ లుక్‌ అదిరింది.. ఫ్యాన్స్ ఫిదా!

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండేళ్ల తర్వాత ముఖానికి రంగేసుకున్న సంగతి తెలిసిందే.

'మీనా బజార్' ఆడియో లాంచ్ !!!

సినీ రాజకీయల సమక్షంలో www. మీనా బజార్., ఆడియో లాంచ్ కార్యక్రమం ఫిబ్రవరి 6న హైదరాబాద్ లో జరిగింది.

శంక‌ర్‌కి షాకిచ్చిన రాజ‌మౌళి..?

ఒకప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానే అని అంద‌రూ అనుకునేవారు.. కానీ ద‌క్షిణాదికి చెందిన కోలీవుడ్ డైరెక్ట‌ర్ త‌మిళ సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటారు.