ఆదిత్య 369 సీక్వెల్ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..

  • IndiaGlitz, [Monday,July 18 2016]

నంద‌మూరి బాల‌కృష్ణ - సింగీతం శ్రీనివాస‌రావు కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ఆదిత్య 369. విభిన్న క‌థాంశంతో రూపొందిన‌ ఆదిత్య 369 ప్రేక్ష‌కాభిమానులు ఆక‌ట్టుకుని తెలుగు నాట మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచింది. ఇక ఈ సంచ‌ల‌న చిత్రం ఆదిత్య 369 రిలీజై నేటికి స‌రిగ్గా 25 ఏళ్లు అయ్యింది.

ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు స్పందిస్తూ...బాల‌య్య వందో చిత్రంగా ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 తెర‌కెక్కాలి. అయితే...అనుకోకుండా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి తెర పైకి వ‌చ్చింది. అంత మాత్రాన ఆదిత్య 369 సీక్వెల్ ఆగిపోయిన‌ట్టు కాదు. బాల‌య్య ఎప్పుడు అంటే అప్పుడు తెర‌కెక్కించ‌డానికి స్టోరీ బోర్డ్ తో స‌హా అంతా రెడీగా ఉంది. ఈ చిత్రంలో బాల‌య్య వార‌సుడు మోక్ష‌జ్ఞ కోసం ఓ పాత్ర రూపొందించిన మాట వాస్త‌వమే. ఈ చిత్రాన్ని ఎప్పుడు తీసినా కొత్త‌గా ఉంటుంది. ఆడియ‌న్స్ కి స‌రికొత్త అనుభూతిని ఇస్తుంది అన్నారు. మ‌రి...బాల‌య్య ఆదిత్య 369 సీక్వెల్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తార‌ని...సింగీతం ఆశ త్వ‌ర‌లో నెర‌వేరుతుంద‌ని ఆశిద్దాం.

More News

ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత మ‌ళ్ళీ విల‌న్‌గానే

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ 2005లో వ‌చ్చిన జై చిరంజీవ సినిమాలో విల‌న్‌గా న‌టించాడు. త‌ర్వాత మ‌ళ్ళీ టాలీవుడ్‌లో నటించ‌లేదు.

2016 నాకు బాగా క‌లిసి వ‌చ్చింది - నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌

బాల‌కృష్ణ, మోహిని జంట‌గా సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొందిన చిత్రం `ఆదిత్య 369`. ఈ సినిమా 1991జూలై 18న విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా టైమ్ మిష‌న్‌పై వ‌చ్చిన సినిమాగా అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

లోగో విడుద‌ల చేసిన ద‌ర్శ‌కేంద్రుడు

`సోగ్గాడే చిన్ని నాయనా`, `ఊపిరి` చిత్రాలు త‌ర్వాత నాగార్జున మ‌రోసారి డిఫ‌రెంట్‌గా భ‌క్తిర‌స‌న ప్ర‌ధాన చిత్రం `ఓం న‌మో వెంక‌టేశాయ` చిత్రంలో న‌టిస్తున్నాడు.

కబాలి ఈజ్ బ్యాక్...ఇవిగో ఫోటోస్

సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ క‌బాలి సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి కాగానే ఆనారోగ్యానికి గురైయ్యారు. ఆయ‌న ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందంటూ కూడా వార్త‌లు వినిపించాయి.

జూలై 29న విడుదలవుతున్న 'పెళ్లి చూపులు'

ధర్మపథ క్రియెషన్స్ మరియు బిగ్ బెన్ సినిమాస్ పై రాజ్ కందుకూరి మరియు యష్ రంగినెని సమ్యుక్తంగా, నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం లొ విజయ్ దెవరకొండ, రీతు వర్మ, నందు ప్రధాన పాత్ర ల్లొ నిర్మించిన చిత్రం పెళ్లిచూపులు.