Congress:ఇండియా టుడే సర్వేలోనూ కాంగ్రెస్‌కే పట్టం.. సీఎంగా మొగ్గు ఎవరికంటే..?

  • IndiaGlitz, [Saturday,December 02 2023]

తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. దీంతో తెలంగాణతో పాటు ఏపీ ప్రజలు కూడా ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే టెన్షన్‌లో ఉన్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. తాజాగా ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సంస్థ తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించింది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 63-73 సీట్లు వస్తాయని.. బీఆర్ఎస్‌కు 34-44 సీట్లు.. బీజేపీ 4-8 సీట్లు.. ఇతరులకు 5-8 సీట్లు వస్తాయని ప్రకటించింది.

సీఎంగా కేసీఆర్ వైపే మొగ్గు..

తెలంగాణలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అని ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో కేసీఆర్ మరోసారి సీఎం కావాలని 32శాతం మంది ప్రజలు కోరుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఫర్వాలేదని 22శాతం మంది ప్రజలు.. రేవంత్ రెడ్డి సీఎం అయితే బాగుంటుందని 21శాతం మంది ప్రజలు కోరుకున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక రూరల్, అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటర్లు పట్టం కట్టినట్టు వెల్లడించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపినట్టు సమాచారం.

బీఆర్ఎస్ నేతలు ఫోన్లు చేస్తున్నారు..

ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ అభ్యర్థుల నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. తమను గుర్తుంచుకోవాలని అవసరమైతే తాము కాంగ్రెస్‌కు మద్దతుగా ఉంటామని అడుగుతున్నారని పేర్కొన్నారు. కానీ తమకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం లేదని.. కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ రాజకీయ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు..

మరోవైపు ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత, ఆ పార్టీ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవితవ్యం గురించి తనకు తెలియదు. కానీ సర్వే ఫలితాలను బట్టి చూస్తే బీఆర్ఎస్ రాజకీయ ప్రయాణం అధికార పక్షంగానే ముగుస్తుందని మాత్రం చెప్పగలనని పేర్కొన్నారు. తెలంగాణకు రానున్న మంచి రోజుల కోసం, కాంగ్రెస్ విజయం కోసం డిసెంబరు 3 వరకు చూద్దామని అన్నారు. హరహర మహాదేవ, జై తెలంగాణ, జై హింద్ అని ట్వీట్ చేశారు.

More News

Animal:బాక్సాఫీస్‌పై రణ్‌బీర్ వైల్డ్‌నెస్.. దుమ్మురేపిన 'యానిమల్' కలెక్షన్స్..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, దర్శకడు సందీప్ రెడ్డి వంగా కాంబో వచ్చిన 'యానిమల్' మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

Bigg Boss Telugu 7 : శెభాష్ అర్జున్ .. వైల్ట్‌కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చి , గ్రాండ్ ఫినాలే‌కి ఫస్ట్ కంటెస్టెంట్‌గా నిలిచి

బిగ్‌బాస్ 7 తెలుగు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో ఫినాలే అస్త్ర కోసం పోటీ జరుగుతోంది.

Chandrababu:జిల్లాల పర్యటనకు సిద్ధమైన చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే..

టీడీపీ అధినేత చంద్రబాబు ఇక పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు.

Andhra:కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న తుఫాన్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Nagarjunasagar Dam:కేంద్రం ఆధీనంలోకి నాగార్జునసాగర్ డ్యామ్.. CRPF బలగాలు మోహరింపు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిప్పు రాజేసిన నీటివివాదం కేంద్రం జోక్యంతో చల్లబడింది.