Krishna Board:తక్షణమే సాగర్ నీటి విడుదల ఆపండి.. ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశాలు..

  • IndiaGlitz, [Friday,December 01 2023]

నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి వెంటనే నీటి విడుదల ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి లేఖ రాశారు. అక్టోబర్ కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. నవంబర్ 30 తర్వాత నీటి విడుదలపై తమకు ఎలాంటి వినతి అందలేదని స్పష్టం చేశారు. నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వం తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

వాస్తవంగా అక్టోబర్ 10 నుండి 20 వరకు 5 టీఎంసీలు, జనవరి 8 నుండి 18 వరకు 5 టీఎంసీలు, ఏప్రిల్ 8 నుండి 24 వరకు 5 టీఎంసీలు వాడుకునే విధంగా ఇరు రాష్ట్రాలు కృష్ణా బోర్డు సమక్షంలో ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పటికే అక్టోబర్ కోసం అడిగిన 5 టీఎంసీల్లో 5.01 టీఎంసీలు ఏపీకి విడుదలయ్యాయి. ఇక వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్‌లో నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం బలవతంగా కుడి కాలువ నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని విడుదలు చేసింది.

మరోవైపు సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం సరైనదేనని, తమ ప్రభుత్వం ఏ తప్పూ చేయలేదని మంత్రి అంబటి రాంబాబు స్పష్టంచేశారు. తమకు ధర్మం ప్రకారం రావాల్సిన నీటిని రైతుల పంటల కోసం విడుదల చేస్తే తప్పేంటని నిలదీశారు. తమ వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోమని అంబటి తెలిపారు. ఆంధ్రా భూభాగంలోకి తమ పోలీసులు వెళ్లడం తప్పు ఎలా అవుతుందని, ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసులు చెల్లవన్నారు. ఇక సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. డ్యాం వద్ద ఇప్పటికే ఏపీ పోలీసులు భారీగా మోహరించగా.. తెలంగాణ పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. డ్యాంపై ఏర్పాటు చేసిన ముళ్లకంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు యత్నించగా ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.

More News

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు పచ్చ నేతల నీతులు.. మీరా మాట్లాడేది..?

అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టైన సత్తారు వెంకటేష్ రెడ్డి ఎన్నారై వైసీపీ నేత అంటూ టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది.

KCR :అధికారంపై కేసీఆర్ ధీమా.. డిసెంబర్ 4న కేబినెట్ భేటీకి నిర్ణయం..

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం మంత్రివర్గ సమావేశానికి సిద్ధమయ్యారు రాష్ట్ర సచివాలయంలో కేసీఆర్‌ అధ్యక్షతన డిసెంబర్ 4వ తేదీన

Re Polling:రీపోలింగ్‌కు అవకాశం లేదు.. 70.79శాతం పోలింగ్ నమోదు: సీఈవో

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 70.79% పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు.

NagarjunaSagar:సాగర్ వద్ద ఆగని ఉద్రిక్తత.. ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. డ్యాం వద్ద ఇప్పటికే ఏపీ పోలీసులు భారీగా మోహరించగా..

America:అమెరికాలో నరరూప రాక్షసులుగా మారిన తెలుగు వ్యక్తులు

బంగారు భవిష్యత్ కోసం ఎంతో కష్టపడి అగ్రరాజ్యం అమెరికా వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లాక వారి బుద్ధి మారింది.