రాముడిగా ప్రభాస్‌నే ఊహించుకున్నా: డైరెక్టర్ ఓం రౌత్

  • IndiaGlitz, [Thursday,January 07 2021]

‘బాహుబలి’ సినిమా తరువాతి నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా మూవీలపైనే ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పూజా హెగ్డేతో కలిసి ప్రభాస్ ‘రాధేశ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేసి నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇక ప్రభాస్ తదుపరి చిత్రం ‘ఆదిపురుష్’ విషయానికి వస్తే.. ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనున్నాడు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ సినిమా గురించి, ప్రభాస్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ఓంరౌత్ మాట్లాడారు. ‘ఆదిపురుష్’ ప్రాజెక్ట్ అనుకోగానే తొలుత తన మైండ్‌లో రాముడి పాత్రలో ప్రభాస్‌నే ఊహించుకున్నానని ఓం రౌత్ వెల్లడించారు. ఒకవేళ ఈ ప్రాజెక్టుకు ప్రభాస్ ఒప్పుకోకపోయి ఉంటే అసలు ‘ఆదిపురుష్’ అనే సినిమానే ఉండేది కాదన్నారు. ఆయన కాదని చెప్పి ఉంటే ‘ఆదిపురుష్' స్క్రిప్ట్‌ను పక్కన పెట్టేసి ఉండేవాడినని ఓం రౌత్ స్పష్టం చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 19 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.

More News

హైదరాబాద్‌లో కిడ్నాప్.. అఖిలప్రియ అరెస్ట్.. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే.

పవర్ స్టార్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్..

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే.

మ‌హేశ్ అభిమానిగా మారిన అక్కినేని హీరో..!

ఇప్పుడున్న యువ హీరోలు అగ్ర క‌థానాయ‌కుల అభిమానులుగా కనిపించ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌యంగా మారింది.

కేంద్ర ప్రభుత్వానికే ఝలక్ ఇచ్చిన కేటుగాళ్లు..

కేంద్ర ప్రభుత్వానికి ఝలక్ ఇవ్వాలంటే ఎన్ని గట్స్ ఉండాలి? కానీ ఇచ్చేశారు కొందరు కేటుగాళ్లు.

విజయ్‌ ఫ్యాన్స్‌కు సెంట్రల్‌ షాక్‌.. నిరుత్సాహంలో కోలీవుడ్‌

కోలీవుడ్‌ అగ్ర హీరోల్లో విజయ్‌ ఒకడు. ఈయన సినిమాలకు ఉండే కలెక్షన్సే వేరు. ఆదరణే వేరు. ఈయన లేటెస్ట్‌ మూవీ 'మాస్టర్‌'.