ఇల్లీ బేబి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు...

  • IndiaGlitz, [Saturday,September 05 2015]

జగన సుందరిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలిగిన గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుగులో సినిమాలు చేయడం లేదు. మరి మనవాళ్ళు ఇలియానాని సంప్రదించడం లేదంటూ గడుసుగా సమాధానం ఇస్తుంది. మనవాళ్లు ఆమెను సంప్రదించపోవడానికి కారణముంది. టాలీవుడ్ లో ఉన్నప్పుడే భారీ మొత్తాన్ని వసూలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎంత వసూలు చేస్తుందోననే భయం కూడా కావచ్చు.

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే రామ్ చరణ్,శ్రీనువైట్లల కాంబినేషన్ డి.వి.వి.దానయ్య రూపొందిస్తోన్న బ్రూస్ లీ' చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్ కోసం చిత్రయూనిట్ కోటిన్నర ఇస్తాం చేయమంటూ ఆమెను అడిగారట. మరి ఇల్లి బేబి ఏమందో తెలియడం లేదు. సినిమాలో ఒక సాంగ్ కోసం అంత ఖర్చు చేయడం అవసరమా అని కూడా అనిపించేలా వార్త వినిపిస్తుంది కదూ...