ఎల్‌.వి.ప్ర‌సాద్ మ‌న‌వ‌డిపై ఇళ‌య‌రాజా ఫిర్యాదు

  • IndiaGlitz, [Saturday,August 01 2020]

త‌న‌ను బెదిరిస్తున్నార‌ని, త‌న స్టూడియోను ఆక్ర‌మించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారంటూ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా ప్ర‌ముఖ సంస్థ ప్ర‌సాద్ ల్యాబ్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎల్‌.వి.ప్ర‌సాద్ మ‌న‌వ‌డు సాయి ప్రసాద్‌పై పోలీసుల‌కు త‌న మేనేజ‌ర్ ద్వారా ఫిర్యాదు చేశారు. అస‌లు గొడ‌వేంటి? అనే వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌సాద్ ల్యాబ్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎల్‌.వి.ప్ర‌సాద్ అప్పట్లో ఇళ‌య‌రాజాకు త‌న చెన్నై స్టూడియోలో ఓ రీరికార్డింగ్ రూమ్‌ను ఇచ్చారు. ఈ విష‌యంపై ర‌మేశ్ ప్ర‌సాద్ కూడా ఏమీ మాట్లాడ‌లేదు. అయితే ఎల్‌.వి.ప్ర‌సాద్ మ‌న‌వ‌డు సాయి ప్ర‌సాద్ మాత్రం ఇళ‌య‌రాజాను స్టూడియో ఖాళీ చేయాలంటూ పేచీ పెట్టారు. కొన్నిరోజుల క్రితం త‌న స్టూడియోలో సాయిప్ర‌సాద్ మ‌నుషులు ప్ర‌వేశించి త‌న వాయిద్య ప‌రిక‌రాల‌ను తీసుకెళ్లి ఇత‌రుల‌కు అమ్మేశారంటూ ఇళ‌య‌రాజా ఆయ‌న‌పై కేసు పెట్టారు.

ఇప్పుడు త‌న‌ను సాయిప్ర‌సాద్ బెదిరిస్తున్నారంటూ మ‌రోసారి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు ఇళ‌య‌రాజా. తాను ఇది వ‌ర‌కు పెట్టిన కేసు కోర్టులో ఉండ‌గానే త‌న నుండి దౌర్జ‌న్యంగా స్టూడియోను ఆక్ర‌మించుకోవాల‌ని చూస్తున్నారంటూ ఫిర్యాదులో ఇళ‌య‌రాజా పేర్కొన్నారు. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై ఎంత వ‌ర‌కు వెళుతుందో చూడాలి.

More News

మూడు రాజధానులపై పవన్ ఏమన్నారంటే...

ఏపీలో శుక్రవారం చోటు చేసుకున్న కీలక పరిణామంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

దేశంలో షాకిస్తున్న కరోనా.. నేడు 57 వేలు దాటిన కేసులు

దేశంలో కరోనా వైరస్ కేసులు షాక్‌కు గురి చేస్తున్నాయి. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

తెలంగాణలో నేడు 2 వేలు దాటిన కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శనివారం హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

ఏపీలో లక్షన్నరకు చేరవవుతున్న కేసులు.. నేడు ఎన్నంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతోంది. రోజుకు పదివేలు కేసులు నమోదవుతున్నాయి.

బాల‌య్య 107కి డైరెక్ట‌ర్ అత‌నేనా?

సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుల్లో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ స్పీడు మీదున్నారు. ఎందుకంటే వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు.