Voter Slip: ఓటర్ స్లిప్ లేదా..? ఏం పర్లేదు.. ఇలా చేసి ఓటు వేయండి..

  • IndiaGlitz, [Thursday,November 30 2023]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇప్పటికే మొదలైంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పల్లె నుంచి నగరాల వరకు ఓటు వేసేందుకు ఓటర్లు క్యూకడుతున్నారు. అయితే కొంతమందికి ఇప్పటికీ ఓటర్ల స్లిప్పులు అందలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఓటర్‌ స్లిప్‌ లేనంత మాత్రాన ఓటు హక్కు కోల్పోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఓటర్‌ స్లిప్‌ రాకపోయినా, మీ పోలింగ్ బూత్‌ ఎక్కడుందో తెలుసుకొని ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చెబుతున్నారు.

మీ పోలింగ్ బూత్‌ వివరాలు ఎలా తెలుసుకోవాలంటే..

*మీ ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న నెంబర్‌ను 1950, 9211728082 నంబర్లకు SMS రూపంలో పంపించాలి. వెంటనే మీ పోలింగ్ కేంద్రం వివరాలు ఎస్సెమ్మెస్‌ రూపంలో వస్తాయి. అంతేకాకుండా 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

*ఓటర్ హెల్ప్‌లైన్‌’ యాప్‌ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఎన్నికల సంఘానికి చెందిన ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోని మీ ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా వివరాలు పొందొచ్చు.

*అలాగే ఎన్నికల సంఘం వెబ్‌సైట్స్‌ www.ceotelangana.nic.in లేదా www.electoralsearch.eci.gov.in ద్వారా కూడా పోలింగ్ కేంద్రాలను తెలుసుకోవచ్చు. అందులో ఉండే Ask Voter Sahaya Mithra చాట్‌బాట్‌ ద్వారా కూడా వివరాలు పొందవచ్చు.

ఒకవేళ మీర ఓటు వేయడానికి ఓటర్‌ కార్డు లేకపోయినా ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. ఆధార్‌ కార్డు, పాస్‌ పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, పాన్‌ కార్డ్‌, కేంద్ర, రాష్ట్ర, పబ్లిక్‌ సెక్టార్‌, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీస్‌ లేదా బ్యాంక్‌ పాస్‌బుక్‌, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు, ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం వంటి వాటిలో ఏదైనా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.

More News

Vijaykanth: కెప్టెన్ కోలుకుంటున్నారు, ఆందోళన వద్దు : భార్య ప్రేమలత సందేశం

తమిళ అగ్రనటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు ఆయన సతీమణి ప్రేమలత క్లారిటీ ఇచ్చారు.

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా.. పలువురు రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేసిన చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్

తెలంగాణలో ఓట్ల జాతర మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. సామాన్యులతో పాటు సినీ

Rules Ranjan:ప్రముఖ ఓటీటీలో 'రూల్స్ రంజన్'.. ఎప్పుడంటే..?

యువ హీరో కిరణ్ అబ్బవరం 'రాజావారు రాణివారు' సినిమాతో అరంగేట్రం చేశాడు. పక్కింటి కుర్రాడిలా నటించి అభిమానులను ఆకట్టుకున్నాడు.

Celebrities:హైదరాబాద్‌లో సినీ సెలబ్రిటీలు ఎక్కడ ఓటేయనున్నారో తెలుసా..?

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు(గురువారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.