వాళ్లిద్దరూ దేవుళ్లు అయితే నేను భక్తుడిని - డైరెక్టర్ పరుశురామ్

  • IndiaGlitz, [Monday,August 08 2016]

అల్లు శిరీష్, లావ‌ణ్య జంట‌గా ప‌రుశురామ్ తెర‌కెక్కించిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు. ఇటీవ‌ల రిలీజైన శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ మాట్లాడుతూ....మా చిత్రానికి ఇండస్ట్రీ నుంచి, సినీ విమ‌ర్శ‌కుల నుంచి ముఖ్యంగా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తుండ‌డం చాలా ఆనందంగా ఉంది. ఇంత రెస్పాన్స్ వ‌స్తుంద‌ని అస‌లు ఊహించ‌లేదు. మంచి కంటెంట్ తో సినిమా తీస్తే ఆద‌రిస్తామ‌ని ప్రేక్ష‌కులు మ‌రోసారి నిరూపించారు.
నేను డైలాగ్స్ బాగా రాస్తాన‌ని అంద‌రూ అంటున్నారు ఆనందంగా ఉంది అయితే...నేను డైలాగ్స్ బాగా రాసాడు అనిపించుకోవాలి అని డైలాగ్స్ రాయ‌ను. సంద‌ర్భానుసారంగా ఆ క్యారెక్ట‌ర్ ఏం మాట్లాడితే బాగుంటుందో అదే రాస్తాను అంతే. ఇంకో విష‌యం...పూరి జ‌గ‌న్నాథ్, త్రివిక్ర‌మ్ త‌ర్వాత డైలాగ్స్ రాయాలంటే ప‌రుశురామ్ అని సోష‌ల్ మీడియాలో అంటున్నార‌ని తెలిసింది. దీనికి నా స‌మాధానం ఏమిటంటే...పూరి గారు, త్రివిక్ర‌మ్ గారు దేవుళ్లు అయితే నేను భ‌క్తుడుని.
ఇక నా సినిమాని చిరంజీవి గారు మ‌రి కొంత మంది బొమ్మ‌రిల్లు సినిమాతో పోల్చారు. అంత గొప్ప సినిమాతో పోల్చ‌డం మాట‌ల్లో చెప్ప‌లేనంత సంతోషంగా ఉంది. ఈ సినిమాకి శిరీష్ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసాడు. ఎన్ని సార్లు చేయ‌మ‌న్నా చేస్తాను మీకు స‌రిగా రాలేదు అనిపిస్తే ఏం ఫ‌ర్లేదు చెప్పండి మీరే నా గురువు అంటూ ఎంతో ఫేష‌న్ తో వ‌ర్క్ చేసాడు. ఇక లావ‌ణ్య కూడా క్యారెక్టర్ కి త‌గ్గ‌ట్టు అద్భుతంగా న‌టించింది. ఈ చిత్రాన్ని ఆద‌రించి మ‌ళ్లీ మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చేయ‌డానికి కావాల్సినంత శ‌క్తిని ఇచ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. నా త‌దుప‌రి చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్ సంస్థ‌లోనే చేయ‌నున్నాను అన్నారు.