KTR:జైలుకు వెళ్లడానికి నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా..? రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..

  • IndiaGlitz, [Wednesday,May 08 2024]

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ మ‌న్నె క్రిశాంక్‌తో ఆయన ములాఖ‌త్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే ముందుకురా.. మీరు సోషల్ మీడియాలో పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టి, ఏది ఒరిజినల్.. ఏది ఫోర్జరి.. ఏది డూప్లికేట్ అనేది తేలుద్దాం అన్నారు.

నిజానిజాలు తేల్చిన తర్వాత తప్పు తమదే అయితే తాను జైలుకు వెళ్తానని.. మీది తప్పు అయితే మీరు జైలుకు వెళ్లడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ఇక‌నైనా బుద్ది, సిగ్గు తెచ్చుకొని వెంట‌నే క్రిశాంక్‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. చేయ‌ని త‌ప్పుకు క్రిశాంక్‌ను అన్యాయంగా జైల్లో వేశారని విమర్శించారు.. రేవంత్ రెడ్డి చిల్లర రాజ‌కీయం చేస్తున్నార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు.

కాగా ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్లు, కరెంట్ బంద్ అయిన కారణంగా నెల రోజుల పాటు సెలవులు ఇచ్చారంటూ ఓ సర్క్యులర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సర్క్యులర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందుకు పోస్ట్ చేసింది. దీంతో గతేడాది జారీచేసిన సర్క్యూలర్‌కు బదులుగా ఫేక్ సర్క్యూలర్ పోస్ట్ చేసి ఓయూ ప్రతిష్టను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారని క్రిశాంక్ షాంక్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఓయూ చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ రావు పోలీసులకు ఫిర్యాదుచసచేశారు. ఈ నేపథ్యంలో మే 1వ తేదిన సూర్యాపేట టోల్ గేట్ వద్ద క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలులో ఉంటున్నారు. క్రిశాంక్ అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

More News

Gadde Rammohan: టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాట్సాప్ చాట్ లీక్.. మహిళలతో అసభ్యకరంగా..!

ఏపీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. పోలింగ్‌కు ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఊరువాడా తిరుగుతూ ఓటు వేయాలని కోరుతున్నారు.

CM Jagan:విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి కోరిన సీఎం జగన్

ఏపీలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోలింగ్‌కు ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీల అధినేతలు విస్తృతంగా ప్రచారం

Pawan:సోదరి భువనేశ్వరిని అవమానించిన వంశీని ఓడించండి: పవన్

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తనకు సోదరి లాంటి వారని జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌ తెలిపారు.

Sharmila:విదేశాలకు పారిపోతారు.. సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతిరెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ గెలుపు కోసం రంగంలోకి హీరోలు

ఏపీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్‌ పిఠాపునం నియోజకవర్గం వైపే అందరి చూపు ఉంది.