జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ టీకా అభివృద్ధికి హైదరాబాదీ కంపెనీ సాయం

  • IndiaGlitz, [Wednesday,May 19 2021]

కరోనా మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా వ్యాక్సిన్ల తయారీకి తెలంగాణ క్రమంగా గ్లోబల్ హబ్‌గా మారబోతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి రెండు వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో కలిసి భారత్ బయోటెక్.. కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ టీకాను దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వినియోగిస్తున్నారు. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కే చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ తయారు చేస్తోంది.

తాజాగా మరో వ్యాక్సిన్‌ను సైతం హైదరాబాదీ కంపెనీ ఉత్పత్తి చేయనుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ బయోలాజికల్ ఈ నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేస్తోన్న కోవిడ్ వ్యాక్సిన్‌ను బయోలాజికల్ ఈ ఉత్పత్తి చేయనుంది. ఈ రెండు కంపెనీల మధ్య త్వరలోనే ఓ ఒప్పందం కుదరబోతోంది. ఈ విషయాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ధృవీకరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది.

జాన్సన్ అండ్ జాన్సన్.. ఇదివరకే కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఆ కంపెనీకి చెందిన జాన్సన్ కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఒప్పందాన్ని బయోలాజికల్ ఈతో త్వరలోనే కుదుర్చుకోబోతున్నట్టు తెలుస్తోంద. ప్రతి సంవత్సరం 60 కోట్ల జాన్సన్ కోవిడ్ వ్యాక్సిన్‌ డోసులను తయారు చేయడానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోనున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటనలో తెలిపింది.

More News

'నేనే అందరినీ చంపుతా'.. వామ్మో.. సమంత యాక్షన్ చూశారా!

స్టార్ హీరోయిన్ సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ' ది ఫ్యామిలీ మ్యాన్ 2'. జూన్ 4న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రాబోతోంది.

ఇంటి వద్ద భారీగా భద్రతను పెంచేసిన మహేష్‌.. కారణమేంటంటే..

కరోనా మహమ్మారి దేశంలో ఏ స్థాయిలో విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి సామాన్యుడు, సెలబ్రిటీ అనే భేదం కూడా చూపడం లేదు.

అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విజయ్‌కాంత్

ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

యుద్ధం చేస్తున్నాం.. ఇప్పుడు వద్దు : ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్ని ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల అభిమానులు ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటారు. కేక్ కటింగ్స్, అన్న దాన కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తుంటారు.

తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందజేసిన నిధి

కరోనా సెకండ్ వేవ్ కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.