త‌మ‌న్నా టాక్ షో..భారీ రెమ్యున‌రేష‌న్‌!!

  • IndiaGlitz, [Monday,June 29 2020]

ఆహాను తెలుగు వారికి మ‌రింత చేరువ చేయ‌డానికి అల్లు అర‌వింద్ చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. టాలీవుడ్‌లోకి కొంత మంది పేరెన్న‌త‌గ్గ ద‌ర్శ‌కుల‌ను, కంటెంట్ రైటర్స్‌ను ఆహా కోసం కంటెంట్ జ‌న‌రేట్ చేయ‌మ‌ని కోరాడు. అలాగే న‌వదీప్‌, హెబ్బా ప‌టేల్ వంటి స్టార్స్‌ను వెబ్ సిరీస్‌ల్లో న‌టింప చేస్తున్నారు. ఇది కాకుండా స్టార్ హీరోయిన్ త‌మ‌న్నాతో ఓ టాక్‌షో ప్లాన్ చేశాడ‌ట అర‌వింద్‌. మెగా క్యాంప్‌తో ఉన్న అనుబంధం కార‌ణంగా త‌మ‌న్నా ఈ టాక్ షో చేయ‌డానికి ఓకే అంది. ల‌క్ష్మీస్ టాక్ షో, రానా నెంబ‌ర్ వ‌న్ యారీ త‌ర‌హా టాక్ షో. దీనికి అల్లు అర‌వింద్ అగ్ర క‌థానాయ‌కులు, నాయిక‌లు వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. అర‌వింద్ కాబ‌ట్టి వీరంద‌రూ వ‌స్తార‌న‌డంలో సందేహం లేదు. ఆహాతో పాటు ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లోనూ ఈ షో ప్ర‌సారం కానుంద‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఓ ఇంట‌ర్వ్యూకి త‌మ‌న్నాకు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నార‌ట‌.

ప‌దిహేనేళ్లుగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న అందం, అభిన‌యాల‌తో అల‌రిస్తోన్న హీరోయిన్ త‌మ‌న్నా. ఈ ముంబై ముద్దుగుమ్మ అచి తూచి సినిమాల‌ను ఎంపిక చేసుకుంటోంది. భారీగానే రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేస్తుంది. అయితే ఇప్పుడు సినిమా రూపు మార‌తుంది. వెండితెర నుండి డిజిట‌ల్ రంగం వైపుకు ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఆక‌ర్షితుల‌వుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని త‌మ‌న్నా తెలివిగా ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చింద‌ని సినీ వ‌ర్గాలంటున్నాయి.

More News

వ‌కీల్‌సాబ్‌కు త‌ప్ప‌ని లీకుల స‌మ‌స్య‌

సినిమా రంగానికి ఇప్పుడు క‌రోనా స‌మ‌స్య పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అయితే క‌రోనా కంటే ముందే సినీ ప‌రిశ్ర‌మ‌ను ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌స్య‌ల్లో ప్ర‌ధాన‌మైన పైర‌సీ కాగా..

అప్ప‌టి వ‌ర‌కు ముద్దుల‌కు దూరం: రెజీనా

తాను ఇప్పుడు ముద్దుల‌కు దూరం అని అంటోంది చెన్నై బ్యూటీ రెజీనా క‌సాండ్ర‌. క‌రోనా ప్ర‌భావంతో సినీ పరిశ్రమ‌లో పెను మార్పులే చోటు చేసుకుంటున్నాయి.

నేను క్షేమంగానే ఉన్నాను:  ఎస్‌.జాన‌కి

ఆదివారం సాయంత్రం సంగీత ప్రేమికుల‌ను క‌ల‌వ‌ర పెట్టే వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది.

ఆ పుకారు ఎవరు పుట్టించారో కానీ..: రేణు దేశాయ్

ప్రముఖ నటి రేణు దేశాయ్ ఓ సినిమాలో నటిస్తున్నారంటూ పుకారు షికారు చేసింది. దీంతో ఆమెకు కాల్స్, మెసేజ్‌లు విపరీతంగా వెళ్లాయి.

‘జీ 5’లో సరికొత్త వినోదామృతం... (3 కొత్త ఎపిసోడ్స్ వచ్చాయి)

సంతోషానికి దివ్యఔషధం వినోదామృతం అని పెద్దలు చెబుతుంటారు. తెలుగు ప్రేక్షకులకు స్వచ్ఛమైన వినోదాన్ని అందించిన బుల్లితెర కార్యక్రమం ‘అమృతం’.