క‌థ చెప్ప‌డానికి అంత ఖ‌ర్చా!!

  • IndiaGlitz, [Monday,August 17 2020]

సినిమా క‌థ‌ను డెవ‌ల‌ప్ చేయ‌డానికి నిర్మాత డ‌బ్బులు ఖ‌ర్చు పెడుతుంటారు. స్టార్ హీరోల సినిమాల‌కైతే ఈ లెక్క పెద్ద‌దిగానే ఉంటుంది. అయితే డెవ‌ల‌ప్ అయిన ఓ క‌థ‌ను చెప్ప‌డానికి మాత్రం ఓ నిర్మాత‌కు రూ.50 వేలు ఖ‌ర్చు అయ్యింద‌ని స‌మాచారం. ఇంత‌కూ ఆ నిర్మాత ఎవ‌రో తెలుసా? దిల్‌రాజు. వివ‌రాల్లోకెళ్తే.. దిల్‌రాజు చైత‌న్య‌తో ఓ సినిమా చేయ‌డానిక సిద్ధ‌మ‌య్యార‌నే సంగ‌తి తెలిసిందే. రైట‌ర్ బీవీఎస్ ర‌వి చెప్పిన పాయింట్ న‌చ్చ‌డంతో దిల్‌రాజు సినిమా చేయ‌డానికి ఓకే చెప్పారు. డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ మెగాఫోన్ ప‌ట్ట‌డానికి రెడీ అయ్యారు. బీవీఎస్ ర‌వి చెప్పిన పాయింట్‌ను ఈ ద‌ర్శ‌కుడు త‌న‌దైన శైలిలో డెవ‌ల‌ప్ చేసుకున్నారు.

క‌రోనా వైర‌స్ కార‌ణంగా విక్ర‌మ్ కుమార్ చెన్నైలోనే ఉండిపోయారు. చైత‌న్య హైద‌రాబాద్‌లో ఉన్నారు. అంతా ఓకే అయిన క‌థ‌ను చైత‌న్య‌కు వినిపించ‌డానికి విక్ర‌మ్ కుమార్ త‌టప‌ట‌యిస్తుండ‌టంతో దిల్‌రాజు చొర‌వ తీసుకుని ఆయ‌నే ప్రైవేట్ ట్యాక్సీని మాట్లాడి విక్ర‌మ్‌ను హైద‌రాబాద్‌కు రప్పించార‌ట‌. విక్ర‌మ్ కుమార్ రానూ పోనూ చార్జీలు యాబై వేల రూపాయ‌లు అయ్యాయ‌నే వార్త‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లుకొడుతున్నాయి.

More News

రైట‌ర్‌గా మారుతున్న ర‌మా రాజ‌మౌళి?

ప్యాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి స‌తీమ‌ణి ర‌మా రాజ‌మౌళి ఆయ‌న సినిమాల‌కు కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

నాన్నగారికి ప్రమాదమేమీ లేదని వైద్యులంటున్నారు: ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు చరణ్ తాజా అప్‌డేట్ ఇచ్చారు.

కులంపై రామ్ ట్వీట్‌

తాను ఇక ట్వీట్స్ చేయ‌న‌ని చెప్పిన రామ్ ఆ మాట చెప్పి ఇర‌వై నాలుగు గంట‌లు గ‌డ‌వ‌క ముందే ట్వీట్ పెట్టారు.

సందీప్‌ కిషన్‌ నిర్మాతగా ‘వివాహ భోజనంబు’

యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌లో అభిరుచి గల నిర్మాత, మంచి భోజన ప్రియుడు ఉన్నారు. ప్రజలకు రుచికరమైన భోజనం,

మ‌రోసారి ఆయ‌న‌కే ఓటేసిన క్రిష్‌..!!

లాక్‌డౌన్ స‌మ‌యంలో ద‌ర్శ‌క నిర్మాత క్రిష్ ఖాళీగా ఉన్నాడు. అయితే ఈ ఖాళీ స‌మ‌యాన్ని క్రిష్ ఏమాత్రం వేస్ట్ చేయ‌లేదు.