చైతు కూడా లాగించేశాడు...

  • IndiaGlitz, [Tuesday,February 09 2016]

నాగ‌చైతన్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న చిత్రం మ‌జ్ను.సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. శృతిహాస‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు సినిమాను స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈసినిమా బిజినెస్‌ను నిర్మాత నాగ‌వంశీ పూర్తి చేసేశాడ‌ట‌. సినిమాకు 17కోట్లు బ‌డ్జెట్ అయితే కృష్ణా డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కులు మిన‌హా మిగ‌తా డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కుల‌ను 22 కోట్ల‌కు అమ్మేశాడ‌ని అంటున్నారు.

More News

పెదనాన్నకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్...

రెబల్ స్టార్ కృష్ణంరాజు...తన దర్శకత్వంలో ప్రభాస్ తో సినిమా చేయాలనేది ఎప్పటి నుంచో కోరిక. ఈ సినిమా కోసం గత కొన్ని రోజులుగా కధా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రభాస్ బాహుబలి 2లో బిజీగా ఉండడం వలన ఈ సినిమా పూర్తయిన తర్వాతే పెదనాన్న కృష్ణంరాజు డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా ఉంటుందనుకున్నారు.

సుకుమార్‌తో గీతాఆర్ట్స్ సినిమా

నాన్న‌కు ప్రేమ‌తో స‌క్సెస్ తర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాంచ‌రణ్ హీరోగా సినిమా ఉంటుంద‌ని మ‌న‌కు తెలిసిందే.

తమిళ డైరెక్టర్ కి ఓకె చెప్పిన రానా...

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో రానా.

ఆపర్ట్ లవ్ గురించి చెప్పే 'మీకు మీరే మాకు మేమే'

తరుణ్ శెట్టి,అవంతిక,కిరిటీ దామరాజు,జెన్ని,భరణ్ ప్రధాన తారాగణంగా నకమా ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'మీకు మీరే మాకు మేమే'.

సాయథరమ్ తేజ్ ప్లేస్ లో రాజ్ తరుణ్...

మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ ప్లేస్ లో..రాజ్ తరుణ్..ఇంతకీ విషయం ఏమిటంటే...