చైతు కూడా లాగించేశాడు...

  • IndiaGlitz, [Tuesday,February 09 2016]

నాగ‌చైతన్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న చిత్రం మ‌జ్ను.సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. శృతిహాస‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు సినిమాను స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈసినిమా బిజినెస్‌ను నిర్మాత నాగ‌వంశీ పూర్తి చేసేశాడ‌ట‌. సినిమాకు 17కోట్లు బ‌డ్జెట్ అయితే కృష్ణా డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కులు మిన‌హా మిగ‌తా డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కుల‌ను 22 కోట్ల‌కు అమ్మేశాడ‌ని అంటున్నారు.