బిచ్చ‌గాడు కి హెల్ప్ చేసిన మ‌హేష్ బాబు..

  • IndiaGlitz, [Saturday,June 18 2016]

విజ‌య్ ఆంటోని, స‌త్న టైట‌స్ జంట‌గా ఫాతిమా విజ‌య్ ఆంటోని నిర్మించిన త‌మిళ చిత్రం పిచ్చైకార‌న్. ఈ చిత్రాన్ని చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి తిరుమల‌ తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్ పై బిచ్చ‌గాడు టైటిల్ తో రిలీజ్ చేసారు. 50 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి డ‌బ్బింగ్ రైట్స్ తీసుకున్న‌ ఈ చిత్రాన్ని బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ కి వారం రోజులు ముందు అంటే మే 13న రిలీజ్ చేసారు. ఈ చిత్ర నిర్మాత‌లు మే 20న బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ అవుతుంది క‌నుక బిచ్చ‌గాడు వారం రోజులు ఆడితే చాలు అనుకున్నారు. అయితే బిచ్చ‌గాడు సినిమాకి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ఫ‌స్ట్ వీక్ లో కేవ‌లం 50 నుంచి 60 స్ర్కీన్స్ లో మాత్ర‌మే రిలీజ్ చేసారు. అయితే మే 20 న రిలీజైన బ్ర‌హ్మోత్స‌వం డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో బ్ర‌హ్మోత్స‌వం చిత్రాన్ని రెండో రోజునే చాలా థియేట‌ర్స్ లో తీసేసి బిచ్చ‌గాడు సినిమాని ప్ర‌ద‌ర్శించారు.

బ్ర‌హ్మోత్స‌వం చిత్రానికి నెగిటివ్ టాక్ రావ‌డం...బిచ్చ‌గాడు సినిమాకి పాజిటివ్ టాక్ రావ‌డంతో..బిచ్చ‌గాడు ఎవ‌రూ ఊహించ‌ని కలెక్ష‌న్స్ సాధిస్తుంది. ఫ‌స్ట్ ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్నారు. అయితే...ఓరిజిన‌ల్ మూవీలో ఉన్న ఫీల్ రీమేక్ లో వ‌స్తుందో లేదో అనే డౌట్ తో డ‌బ్బింగ్ చేసార‌ట‌. బిచ్చ‌గాడు రిలీజై నాలుగోవారం అవుతున్నా...నేటికీ క‌లెక్ష‌న్స్ స్ట్రాంగ్ గా ఉండ‌డం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల కలెక్షన్స్ ను వ‌సూలు చేస్తూ.. విమర్శకులు సైతం ఆశ్చర్యపోయేలా బిచ్చ‌గాడు సినిమా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే తమిళంలో కూడా సినిమా హిట్టయ్యింది కానీ తెలుగులో సాధించినంత పెద్ద సక్సెస్ సాధించలేదని ట్రేడ్ వర్గాల స‌మాచారం. తెలుగులో ఏకంగా 13 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు బిచ్చ‌గాడు..! సో...ఈ ర‌కంగా బిచ్చ‌గాడు సూప‌ర్ స‌క్సెస్ సాధించ‌డానికి మ‌హేష్ బాబు హెల్ప్ చేసాడు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

More News

బోయ‌పాటి నెక్ట్స్ మూవీలో అత‌ను న‌టిస్తున్నాడా..

స‌రైనోడు సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించిన బోయ‌పాటి శ్రీను నెక్ట్స్ మూవీని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేస్తున్నారు. ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది.

మార్ష‌ల్ ఆర్ట్ నేర్చుకుంటున్న చ‌ర‌ణ్‌...

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్, సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ధృవ‌’. తమిళ చిత్రం తనీ ఒరువన్ కు ఇది రీమేక్. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అర‌వింద్ స్వామి నెగ‌టివ్ రోల్ చేస్తున్నాడు.

స్పెషల్ సాంగ్ చేస్తుంది...అందుకేనా..ఏమో?

మెగాపవర్ స్టార్ రాంచరణ్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రం ధవ.తమిళ చిత్రం తనీ ఒరువన్ కు రీమేక్గా ఈ చిత్రం రూపొందుతోంది.

రెండు ద‌శాబ్దాల త‌ర్వాత విల‌న్ గా...

కెరీర్ స్టార్టింగ్ లో చిన్న క్యారెక్ట‌ర్స్‌ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ త‌ర్వాత విల‌న్ గా కూడా ప‌లు చిత్రాల్లో న‌టించాడు., త‌ర్వాత హీరోగా మారిన త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌తో బిజీగా మారిపోయాడు.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'త్రయం'

విషు రెడ్డి,అభిరామ్,సంజన,అశోక్ ప్రధాన పాత్రల్లో పంచాక్షరీ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతొన్న చిత్రం 'త్రయం'.