Vrushabha:‘వృషభ’ టీంలో భాగస్వామిగా హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో

  • IndiaGlitz, [Monday,August 07 2023]

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహన్ లాన్, రోషన్ మేక, శనయ కపూర్‌, జహ్రా ఖాన్‌ల‌తో పాన్ ఇండియా వైడ్‌గా చేస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘వృషభ’. ఈ ప్రాజెక్టులోకి హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో భాగస్వామి అయ్యారు.

మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలు నిక్ తుర్లో నిర్మించాడు. సహ నిర్మాతగా వ్యవహరించాడు. వృషభ టీంలోకి నిక్ తుర్లో రావడంతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కబోతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన 57 సెకన్ల వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సినిమాలోని సెట్స్, ఎంత భారీగా తెరకెక్కించబోతోన్నారనే విషయాన్ని చూపించారు. హాలీవుడ్ స్టైల్‌ను ఫాలో అవుతున్న తీస్తోన్న మొదటి సినిమాకు వృషభ రికార్డులకు ఎక్కింది.

హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో మాట్లాడుతూ.. ‘వృషభ అనేది నా మొదటి ఇండియన్ సినిమా. ఈ సినిమాలో నేను భాగస్వామిని అవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. హాలీవుడ్ కాకుండా ఇతర దేశాల్లో నేను పని చేస్తున్న మొదటి సినిమా ఇది. అలానే నేను ఫస్ట్ టైం ఓ బహా భాషా సినిమాకు పని చేస్తున్నాను. నేను ప్రతీ సినిమాను మొదటిదానిలానే ఫీల్ అవుతాను.. ప్రతీ సినిమా నుంచి ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటాను.. వృషభ సైతం అలాంటి ఓ అందమైన ప్రయాణం అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నిర్మాత విశాల్ గుర్నాని మాట్లాడుతూ.. ‘హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో వంటి వారు మా ప్రాజెక్టులోకి రావడం కలలా ఉంది. ఇలాంటి కల కనడానికి కూడా సాధ్యం కాదు. కానీ ఆయన ఈ సినిమాలోకి రావడంతో స్థాయి పెరిగింది. భారీతనం వచ్చింది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించబోతోన్న మొదటి ఇండియన్ సినిమాగా వృషభ రికార్డులకెక్కింది. మా వృషభ టీం మీద నమ్మకంతో ప్రాజెక్టులోకి వచ్చిన నిక్ తుర్లోకి ధన్యవాదాలు’ అని అన్నారు.

తండ్రీ కొడుకుల మధ్య వచ్చే హై ఆక్టేన్ ఎమోషనల్ డ్రామాగా వృషభ రాబోతోంది. మెగాస్టార్ మోహన్ లాల్, రోషన్ మేక, శనయ కపూర్, జహ్రా ఖాన్, శ్రీకాంత్ మేక, రాగిణి ద్వివేది వంటి వారు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఎమోషన్స్, వీఎఫ్ఎక్స్, యాక్షన్ సీక్వెన్స్ భారీ ఎత్తున చూపించబోతోన్నారు. వచ్చే ఏడాదిలో రిలీజ్ కాబోతోన్న అతి పెద్ద ప్రాజెక్టుల్లో వృషభ సైతం ఒకటి కానుంది.

కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నంద కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతోన్నారు.

More News

Rahul Gandhi:పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ .. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు సోమవారం లోక్‌సభ సచివాలయం ప్రకటించింది.

CM KCR:రేపు అధికారిక లాంఛనాలతో గద్ధర్ అంత్యక్రియలు.. కేసీఆర్ ఆదేశాలు

ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్ధర్ అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు.

RTC:సస్పెన్స్‌కు చెక్ .. ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై గ్రీన్ సిగ్నల్ , కేసీఆర్‌కు 10 సూచనలు

టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన బిల్లుపై సస్పెన్స్ వీడింది.

Gaddar:ప్రజా గాయకుడు గద్ధర్ కన్నుమూత : ఆట, పాటతో బడుగులకై పోరాడి.. దీవికేగిన ప్రజా యుద్ధ నౌక

ప్రజాగాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్నారు గద్ధర్.

Ileana D'Cruz : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పిల్లాడి పేరేంటో తెలుసా..?

గోవా బ్యూటి ఇలియానా తల్లి అయ్యారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించారు.