హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య

  • IndiaGlitz, [Wednesday,February 17 2021]

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హైకోర్టు న్యాయవాది దంపతులను సుమారు వంద మంది చూస్తుండగానే విచక్షణారహితంగా నరికి చంపేశారు. రామగిరి మండలం కలవచర్ల గ్రామంలో ఈ దారుణం జరిగింది. స్వగ్రామానికి వచ్చి కారులో తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్న హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులను కల్వచర్ల పెట్రోల్ బంకు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. కారు ఆపిన వెంటనే వామన్‌రావు, నాగమణి దంపతులపై దాడికి పాల్పడ్డారు. కారులోనే నాగమణి ఉండిపోగా.. కారు దిగిన వామన్‌రావును అందరూ చూస్తుండగానే విచక్షణా రహితంగా నరికేశారు.

రెండు ఆర్టీసీ బస్సులలోని ప్రయాణికులు, ఇతర వాహనదారులు చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. 108 వాహనంలో వామన్‌రావు దంపతులను పెద్దపల్లిలోని ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. అలాగే వామన్‌రావు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వామన్‌రావు స్వగ్రామం మంథని మండలం గుంజపడుగు. వామన్‌రావు దంపతుల హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ గ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ఘోరం జరిగింది.

కాగా.. వామన్‌రావు చనిపోవడానికి ముందు టీఆర్ఎస్ మంథని మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ కూడా గుంజెపడుగుకు చెందిన వ్యక్తే కావడం విశేషం. శీలం రంగయ్య అనే వ్యక్తి లాకప్‌డెత్ కేసును వామన్‌రావు వాదించారు. ఈ నేపథ్యంలోనే తమకు శ్రీనివాస్, కుమార్ అనే వ్యక్తులపై అనుమానం ఉన్నట్టు వామన్‌రావు సోదరుడు ఇంద్రశేఖర్ చెబుతున్నారు. మరోవైపు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని.. ఇప్పటికే నిందితుల కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్టు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా వదలబోమని స్పష్టం చేశారు.

More News

నిర్మాతగా రవితేజ.. నిజమెంతో..?

మాస్ మ‌హారాజ ర‌వితేజ‌. నేటిత‌రం యువ హీరోలు చాలా మందికి ఇన్‌స్పిరేష‌న్‌. ఎలాంటి స‌పోర్ట్ లేకుండా అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేసిన ర‌వితేజ త‌ర్వాత న‌టుడిగా మారడం,

తార‌క్ ఎమోష‌న‌ల్ స్పీచ్‌.. జ‌నాలు మారుతారా?

మ‌నం చేసే నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఎదుటివారు ప్రాణాలు కోల్పోతారు. అండ కోల్పోతారు. కాబ‌ట్టి మ‌న‌ల్ని మ‌నం స‌రిద్దిద్దుకోవాలి అని అంటున్నారు స్టార్ హీరో ఎన్టీఆర్ ఈరోజు సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక

‘రాధేశ్యామ్‌’లో ప్ర‌భాస్ కాస్ట్యూమ్స్ కోసం ఎంత ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

ప్యాన్ ఇండియాస్టార్ ప్ర‌భాస్ ఇమేజ్ బాహుబ‌లి త‌ర్వాత మారిపోయింది. ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుకుంటే మినిమం మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ పెట్టుకోవాల్సి వ‌స్తుంది మ‌రి.

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ నాగ్ అశ్విన్ ..కార‌ణ‌మేంటో తెలుసా?

బాహుబ‌లితో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ సాహో త‌ర్వాత వ‌రుసగా నాలుగు ప్యాన్ ఇండియా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఇందులో ముందుగా

బుచ్చిబాబు నెక్ట్స్ మూవీ..ప్లానింగ్ అదిరిందిగా..!

ఉప్పెన‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా, తొలి సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ సొంతం చేసుకున్నాడు. దీంతో నిర్మాత‌లంద‌రూ బుచ్చిబాబుతో సినిమా చేయాల‌ని ఉవ్విలూరుతున్నారు.