దత్తత తీసుకోవాలనుకుంటున్న హీరోయిన్...

  • IndiaGlitz, [Wednesday,September 02 2015]

దక్షిణాది సినిమాలతో పాటు ఉత్తరాది సినిమాల్లో కూడా బిజీ హీరోయిన్ గా వరుస ప్రాజెక్ట్స్ తో ముందుకెళ్తున్న హీరోయిన్ శృతిహాసన్. కమల్ తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి ఇప్పుడు తనదైన గుర్తింపుతో ముందుకు సాగుతుంది. రీసెంట్ గా తెలుగులో శ్రీమంతుడు' చిత్రంతో హిట్ అందుకుంది.

ఈ చిత్రంలోహీరోను మంచి చేయాలంటే ఎవరినైనా దత్తత తీసుకోవాలని మోటివేట్ చేసే చారుశీల క్యారెక్టర్ లో శృతిహాసన్ నటించింది. ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా అదే బాటలో పయనించబోతుంది. త్వరలోనే తమిళనాడులోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకొనే ఆలోచనలో ఉందట. అయితే అది ఏ గ్రామామో కచ్చితంగా నిర్ణయించుకోలేదట. ఈ నిర్ణయం తీసుకోడానికి వెనుక మహేష్ కారణం కాదని, తన తండ్రి చేసే సేవా కార్యక్రమాలను చూసి ఎప్పటి నుండో మోటివేట్ అయ్యానని కూడా అంటుందట. ఏదైతేనేం ఒక మంచి పని జరుగుతుంది....