వెంకీ జోడీ కుదిరిందా?

  • IndiaGlitz, [Monday,December 11 2017]

గురు త‌రువాత సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్.. త‌న త‌దుప‌రి చిత్రానికి బాగానే గ్యాప్ తీసుకున్నారు. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌లే త‌న తాజా చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు వెంకీ. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇంకా ఎవ‌రిని క‌న్‌ఫ‌ర్మ్ చేయ‌లేదు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అదితి రావ్ హైద‌రీ క‌థానాయిక‌గా ఎంపికైంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది వేస‌విలో విడుద‌లైన త‌మిళ అనువాద చిత్రం చెలియాతో అదితి.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సుధీర్ బాబు హీరోగా న‌టిస్తున్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

మెహ‌రీన్‌, అనుష్క‌, కాజ‌ల్‌, త‌మ‌న్నా.. ఇలా కొంత‌మంది ప్ర‌ముఖ క‌థానాయిక‌ల పేర్లు ఈ సినిమా విష‌యంలో వినిపించాయి. ఆఖ‌రికి ఆ అవకాశం అదితికి ద‌క్క‌డం ఆమె అదృష్ట‌మ‌నే చెప్పాలి.

ఆటా నాదే వేటా నాదే అనే పేరు పరిశీల‌న‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది వేస‌వి సంద‌డి చేయ‌నుంది. కేవ‌లం 60 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాల‌ని తేజ ప్లాన్ చేశార‌ని తెలిసింది.

More News

'ఒక్క క్షణం' ఆ సినిమాకి కాపీ వెర్షనా?

అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం `ఒక్క క్షణం`. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` చిత్రంతో ఆకట్టుకున్న వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మణిశర్మ సంగీతమందించారు.

'హలో'.. అనూప్ మెప్పించాడు

జై చిత్రంతో సంగీత దర్శకుడిగా తొలి అడుగులు వేసిన అనూప్ రూబెన్స్.. హలో చిత్రంతో 50 చిత్రాల మైలురాయికి చేరుకున్నాడు.

అల్లు శిరీష్ కి కూడా కలిసొస్తాడా?

మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన సంగీత దర్శకుడు అంటే మొదటగా వినిపించే పేరు మెలోడీ బ్రహ్మ మణిశర్మ.

వస్తున్నాం..బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం..ఇది ఫిక్స్ !! - కింగ్ నాగార్జున

అఖిల్ హీరోగా సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులను, సినీ ప్రేక్షకులను `హలో`అంటూ డిసెంబర్ 22న పలకరించబోతున్నారు యూత్ కింగ్ అఖిల్ అక్కినేని. ఈయన కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ సమర్పణలో 'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక

రాజ‌మౌళి.. కుటుంబ‌క‌థా చిత్రం?

స్టూడెంట్ నెం.1 నుంచి బాహుబ‌లి 2 వ‌ర‌కు వ‌రుస విజ‌యాల‌తో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. బాహుబ‌లి సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని సంపాదించుకున్న రాజ‌మౌళి.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో మ‌ల్టీస్టార‌ర్ మూవీగా చేయ‌బోతున్నార‌ని చాలా రోజులుగా వారĺ