ప్ర‌భాస్ జ‌త‌గా చేయ‌డానికి భారీ డిమాండ్ చేసిన బ్యూటీ

  • IndiaGlitz, [Wednesday,April 15 2020]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అదే స‌మ‌యంలో త‌న 21వ సినిమాను నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. అంతా స‌జావుగానే సాగుతున్న‌స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ప్ర‌భాస్ 20వ సినిమా షూటింగ్ ఆగింది. ఈ ప్ర‌భావం ప్ర‌భాస్ 21పై ప‌డింది. దీంతో న‌వంబ‌ర్‌లో ప్రారంభించాల‌నుకున్న ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ సినిమా ఆల‌స్య‌మ‌య్యే అవకాశం క‌న‌ప‌డుతుంది. అయితే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మాత్రం జ‌రుగుతున్నాయ‌ట‌.

ఒక ప‌క్క ప్ర‌భాస్ . మ‌హాన‌టి డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగానే తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో ప్ర‌భాస్ జ‌త‌గా దీపికా ప‌దుకొనెను న‌టింప చేయాల‌ని నిర్మాత‌లు భావించి ఆమెను సంప్ర‌దించార‌ట‌. అందుకు దీపికా దాదాపు రూ.20 కోట్లను డిమాండ్ చేసిందట‌. దీంతో నిర్మాత‌లు దీపిక ఓకేనా లేక మ‌రేవ‌రినైనా సంప్ర‌దించాలా? అని ఆలోచించుకుంటున్నార‌ట‌. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా క‌రోనా ప్ర‌భావంతో ఆల‌స్య‌మ‌య్యేలానే ఉంది.