ఉదయం చిరంజీవి.. ఇప్పుడు శ్రీకాంత్‌, తెలుగు ఇండస్ట్రీపై కోవిడ్ పడగ

తెలుగు చిత్ర పరిశ్రమపై కోవిడ్ పగబట్టినట్లుగా వుంది. ఇప్పటికే మహేశ్ బాబు, మంచు లక్ష్మీ, మంచు విష్ణు, విశ్వక్ సేన్, రాజేంద్ర ప్రసాద్, తమన్ తదితరులు వైరస్ బారినపడ్డారు. ఇవాళ మెగాస్టార్ చిరంజీవికి కూడా పాజిటివ్‌గా తేలింది. తాను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ బారినపడ్డానని మెగాస్టార్ ట్వీట్ చేశారు. కొద్దిగంటల్లోనే హీరో శ్రీకాంత్ కూడా కరోనా బారినపడ్డారు. గత కొన్ని రోజులుగా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ సోకింది.. ఇటీవలికాలంలో నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని శ్రీకాంత్ ట్వీట్టర్ ద్వారా పేర్కొన్నారు.

కాగా.. ఫ్యామిలీ హీరోగా తెలుగువారిని అలరించిన శ్రీకాంత్.. యువతరం రాకతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అయ్యారు. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్‌కు బాబాయ్‌గా నటించి మెప్పించారు. అయితే తన సహచర నటుడు జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా జీవించడం.. ఆ తర్వాతి నుంచి ఆయన బిజీ కావడంతో తాను కూడా విలన్‌గా మారాలని శ్రీకాంత్ నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘‘అఖండ’’లో ఆయన ప్రతినాయక పాత్ర పోషించారు. ఈ రోల్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఆయనకు వరుసపెట్టి నెగిటివ్ రోల్స్ క్యూకడుతున్నాయి.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా శ్రీకాంత్ విలన్ రోల్ చేయబోతున్నారు. ఇందులో తన క్యారెక్టర్ ఓ రేంజ్‌లో వుంటుందని ఓ ఇంటర్యూలో శ్రీకాంత్ వెల్లడించారు. శ్రీకాంత్ కోవిడ్ బారినపడటంతో కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం కానున్నారు. దీంతో ఆయన చేస్తున్న ప్రాజెక్ట్‌లకు షూటింగ్‌లు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

More News

టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను నియమించిన కేసీఆర్.. ఏ జిల్లాకు ఎవరంటే..?

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఏకకాలంలో పార్టీ అధ్యక్షులను నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

15 ఏళ్ల నాటి ‘‘ముద్దు’’ కేసు.. శిల్పా శెట్టికి కోర్టులో ఊరట

బ‌హిరంగ ముద్దు కేసు నుంచి బాలీవుడ్ సీనియర్ న‌టి శిల్పా శెట్టికి కోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది.

కోవిడ్ బారినపడ్డ చిరంజీవి.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి వదల్లేదంటూ ట్వీట్

దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం కోవిడ్ బారినపడుతున్నారు.

పెద్ద తెర కట్టి, డీజే బాక్స్‌‌లు పెట్టి.. ‘‘అఖండ’’ను వీక్షించిన గ్రామస్తులు

సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ల తర్వాత బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘‘అఖండ’’.

కూతురి బర్త్ డే.. ప్రగతి ఆంటీ ఏమోషనల్ పోస్ట్

1990ల కాలం నుంచి నటిగా రాణిస్తున్నారు ప్రగతి.... ప్రస్తుతం అమ్మ, అక్క, వదిన, అత్త వంటి స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ పోషిస్తూ బిజీగా వున్నారు.