close
Choose your channels

Manchu Manoj:యస్.. మౌనికా రెడ్డిని పెళ్లాడబోతున్నా , ఎట్టకేలకు ఓపెన్ అయిన మనోజ్... ఈ రోజే వెడ్డింగ్

Friday, March 3, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఊహాగానాలే నిజమయ్యాయి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా మనోజ్, భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికా రెడ్డితో సన్నిహితంగా వుంటున్నారు. అప్పట్లోనే వీరిద్దరూ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఈ కథనాలపై ఇరు కుటుంబాలు స్పందించలేదు. మనోజ్ సోదరి, నటి మంచు లక్ష్మీ కూడా తనకు ఏం తెలియదని మీడియాతో చెప్పారు. తీరా కట్ చేస్తే.. అదే మౌనికా రెడ్డిని తాను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా మనోజ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాబోయే భార్య ఫోటోని కూడా ఆయన పంచుకున్నారు. నిన్న మొన్నటి వరకు మౌనంగా వున్న మనోజ్ చివరికి ఓపెన్ కాక తప్పలేదు. తన పోస్ట్‌క #ManojWedsMounika, #MWedsM హ్యాష్ ట్యాగ్స్ జోడించారు.

ఫిల్మ్‌నగర్‌లో మనోజ్ - మౌనిక పెళ్లి:

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మోహన్ బాబు ఇల్లు అందరికీ తెలిసిందే. ఆ ఇంటిని ఆయన తన కుమార్తె లక్ష్మీమంచుకు రాసినట్లు ఫిలింనగర్ టాక్. ఇప్పుడు ఆ ఇంట్లోనే మనోజ్- మౌనికా రెడ్డిల పెళ్లి జరగనుంది. ఈ వేడుకకి ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందింది. రాత్రి 8.30 గంటలకు వేద పండితులు ముహూర్తం నిర్ణయించారు.

ప్రణతితో విడాకుల తర్వాత ఒంటరిగానే మనోజ్:

కాగా.. మంచు మనోజ్ తొలుత ప్రణతి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2019లో విడాకులు తీసుకుంది. ఆనాటి నుంచి మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నోసార్లు మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ అవన్నీ గాలి వార్తలేనని తేలిపోయింది. కానీ ఇప్పుడు తాజా ఘటన వెనక కథేంటో అర్ధం కావడం లేదు. ఇక భూమా మౌనికా రెడ్డి విషయానికి వస్తే, ఇమెకు కూడా ఆల్రెడి పెళ్లయ్యింది. బెంగళూరుకు చెందిన గణేష్ రెడ్డితో మొదటి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఐదేళ్ల బాబు కూడా వున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ దంపతులు రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. గణేష్‌ నుంచి వీడిపోయాక.. మౌనికా రెడ్డి హైదరాబాద్‌లోనే వుంటున్నారు.

తొలిసారి మీడియా కంట మనోజ్-మౌనిక

గతేడాది హైదరాబాద్ నగరంలోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు మంచు మనోజ్ వచ్చారు. ఆయనొక్కరే వచ్చుంటే ఏముండేది కాదు.. కానీ మనోజ్ వెంట దివంగత భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనిక రెడ్డి రావడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో మనోజ్- మౌనికా రెడ్డిలు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియా కోడై కూస్తోంది. ఆ తర్వాత చాలా వేదికలపై వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment