'హ‌లో'.. మెరిసే మెరిసే పాట విశ్లేష‌ణ‌

  • IndiaGlitz, [Saturday,December 09 2017]

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హలో'. అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబు, అజయ్ ముఖ్య పాత్రలు పోషించారు. నాగార్జున నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టరు. రెండు రోజుల క్రితం.. రమ్యకృష్ణ, జగపతి బాబు, అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్ లపై చిత్రీకరించిన పాట‌ను.. నాగార్జున బిట్ సాంగ్‌గా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

మ్యారేజ్ ఫంక్షన్లో (సంగీత్)లో వచ్చే పాట ఇది. శుక్ర‌వారం అఖిల్ పూర్తి పాట‌ని ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేశారు. “మెరిసే మెరిసే మెరిసే ఆ కన్నుల్లో ఏదో మెరిసే.. ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే” అని పల్లవితో మొదలై.. చరణంలో “రెండు గుండెల చప్పుడు ఒక్కటై, మూడు ముళ్ళ ముచ్చట కాగా, ఈడు జోడు కలిసి, తోడు నీడై సాగగా” అంటూ పెళ్లిలోని మాధుర్యాన్ని, ఆ జంట అనుబంధాన్ని ఎంతో చక్కగా చెప్తూనే.. పెళ్ళైన తర్వాత కింగ్ లాంటి మగాడు కూడా భార్య ఏది చెప్తే అది చేస్తేనే ఆ జీవితం సాఫీగా సాగుతుంది అంటూ నాగార్జున హీరోగా వచ్చిన మన్మథుడు' సినిమాలో “వద్దురా సోదరా” పాటను గుర్తుకు తెచ్చారు గీత రచయిత.

ఎంతో ఖర్చు పెట్టి వేసిన సెట్, ఈ పాటని చూస్తుంటే హిందీ సినిమాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా కరణ్ జోహార్ సినిమా 'కభి ఖుషి కభి ఘమ్‌'లో 'బోలె చూడియాన్' పాటని దృష్టిలో పెట్టుకుని ఈ పాటని మలిచినట్టున్నారు. మొత్తానికి ఈ పాట వినడానికి, చూడడానికి కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ డిసెంబర్ 10న వైజాగ్ లో జరుగనుంది. అలాగే ఈ మూవీని డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More News

విజ‌య్ దేవ‌రకొండ కొత్త మూవీ టైటిల్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యూత్ హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌డు. పెళ్ళి చూపులు స‌క్సెస్ త‌ర్వాత విడుద‌లైన 'అర్జున్ రెడ్డి' సెన్సేష‌న‌ల్ హిట్ కావ‌డంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. దీంతో వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్నారు.

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. క్లాప్‌తో ప్రారంభమైన 'వాళ్లమ్మాయి'

'లవ్‌లీ' 'ఉయ్యాలా జంపాలా', 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' 'బాహుబలి' వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న నిఖిల్‌ దాదాపు యాభై చిత్రాలకు పైగా నటించాడు.

డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా '2 కంట్రీస్' విడుదల

"జై బోలో తెలంగాణా" లాంటి యునానిమస్ హిట్ అనంతరం శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మలయాళ సూపర్ హిట్ సినిమా "2 కంట్రీస్"కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న చిత్రం "2 కంట్రీస్".

సాక్షి చౌదరి ప్రధాన పాత్రలో యేంటి రాజా యూత్ ఇలా ఉంది...

లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎమ్వీఎస్ సాయి క్రిష్ణారెడ్డి నిర్మిస్తున్న చిత్రం యేంటి రాజా యూత్ ఇలా ఉంది. దర్శకుడు ఆది శేష సాయి రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

'హ‌లో' షూటింగ్ పూర్తి

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన చిత్రం 'హలో'. కల్యాణి ప్రియదర్శ‌న్  హీరోయిన్. రమ్యకృష్ణ, జగపతిబాబు, అజయ్ ముఖ్య పాత్రలు పోషించారు.