Rain in Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. బయటకు రావొద్దని హెచ్చరిక..

  • IndiaGlitz, [Thursday,May 16 2024]

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. ‌‌మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ ఎత్తున వర్షం పడింది. దీంతో నగరం మొత్తం తడిసిముద్దయింది. రోడ్లన్ని వర్షపు నీటితో నిండిపోయాయి. పలు చోట్లలో రోడ్లపై పెద్దఎత్తున వర్షపు నీరు నిలవటంతో.. భారీగా ట్రాఫిక్ జామైంది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కూకట్ పల్లి, నిజాంపేట, జీడిమెట్ల, సికింద్రాబాద్, తదితర‌ ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అవసరమైతే తప్ప బయటి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రాత్రి సమయంలోనూ భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావటంతో రోడ్లపై తీవ్రస్థాయిలో ట్రాఫిక్ జాం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని నీళ్లు నిలిచే ప్రాంతాల్లో నిదానంగా వెళ్లాలని సూచిస్తున్నారు.

అటు తెలంగాణలోని జిల్లాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. మరో ఐదు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. పిడుగులు పడే అవకాశం ఉందని రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు భారీ వర్షం కారణంగా ఇవాళ రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కావాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రౌండ్‌లో భారీగా వర్షం చేరింది. దీంతో ఆ నీటిని బయటకు తోడి.. పిచ్‌ను ఆరబెట్టాల్సి ఉంటుంది. అయితే సాయంత్రం మరోసారి వర్షం పడితే మ్యాచ్‌కు తీవ్ర ఆటంకం కలగొచ్చు. హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరుకోవాలంటే సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన టైటాన్స్‌కు ఈ సీజన్లో ఇదే చివరి మ్యాచ్. దీంతో ఆ టీంకు ఎలాంటి నష్టం ఉండదు.

More News

ఏపీలో భారీగా పెరిగిన పోలింగ్.. ఆ పార్టీకే ప్లస్ కానుందా..?

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదుకావడం విశేషం. గత ఎన్నికలతో పాటు ఇప్పటి వరకు నాలుగు దశల పోలింగ్‌తో పోల్చుకుంటే

Pawan Kalyan:అకీరాకు నేను ఇచ్చిన ఆస్తి ఇదే.. ఇక వాడి ఇష్టం: పవన్ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. గత కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

CM Jagan:మళ్లీ వైసీపీదే అధికారం..ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నాం: సీఎం జగన్

ఏపీలో పోలింగ్ ముగిసి మూడు రోజులు అవుతుంది. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

AP:ఏపీలో పథకాల లబ్ధిదారులకు శుభవార్త.. డీబీటీ నిధులు జమ ప్రారంభం..

ఏపీ ఎన్నికల వేళ చర్చనీయాంశమైన సంక్షేమ పథకాల నిధుల విడుదల ప్రారంభమైంది. పోలింగ్ పూర్తి కావడంతో

YCP MLC:షాకింగ్ న్యూస్.. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీపై అనర్హత వేటు

ఏపీలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. పోలింగ్‌కు ముందు చాలా మంది వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేసి టీడీపీ,