సుశాంత్ ఆత్మతో మాట్లాడాడట.. వీడియో వైరల్

  • IndiaGlitz, [Saturday,July 18 2020]

సుశాంత్ రాజ్‌పుత్ అకాల మరణం పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఆయనొక స్టార్ హీరోగా ఎదిగే క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడినప్పటికీ ఆయనకు ఎందరు అభిమానులున్నారో మరణం తరువాత గానీ తెలియరాలేదు. సుశాంత్ మరణం ఎందరో అభిమానుల్ని కృంగదీసింది. పోస్టుమార్టం రిపోర్టులో సుశాంత్‌ది ఆత్మహత్య అని తేలినప్పటికీ ఇప్పటికీ ఆయన మరణంపై అనుమానాలైతే అభిమానుల్లో అలాగే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో అభిమానులు పారానార్మల్ యాక్టివిస్ట్ స్టీవ్ హుఫ్‌ను అభిమానులు సంప్రదించారని తెలుస్తోంది. ఆయన సాధారణంగా చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు.

కాగా సుశాంత్ ఆత్మతో కూడా మాట్లాడాలని ఆయన అభిమానుల నుంచి తనకు మెయిల్స్, మెసేజ్‌లు వచ్చాయని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టీవ్ హుఫ్ సుశాంత్ ఆత్మను సంప్రదించినట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 13న ఆయన ఆస్ట్రల్ డోర్ వే సహాయంతో సుశాంత్ ఆత్మను సంప్రదించినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఫేస్ బుక్, యూట్యూబ్ ఛానల్స్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో సుశాంత్ నుంచి స్టీవ్ పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి ఫాలో అప్ కూడా ఉంటుందని స్టీవ్ హుఫ్ చెబుతున్నారు.

More News

గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్..

భారత్ బయోటెక్ అభివ‌ృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే.

అక్కడ థియేటర్స్‌కు పర్మిషన్ వచ్చేసింది.. మరిక్కడ?

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికీ కూడా కష్టాల్లో ఉన్న పరిశ్రమ ఏదైనా ఉందంటే..

వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి కరోనా పాజిటివ్..

ఏపీలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలోని రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు.

'క‌ల‌లు చూసినా క‌న్నులే  నేడు మోసెనే క‌న్నీల్లే.. అంటూ సిద్ శ్రీ‌రామ్ పాట‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా'

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో

తేజ చిత్రంలో మరోసారి కాజల్ అగర్వాల్‌..?

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తేజ ... ఒక‌ప్పుడు చిత్రం, నువ్వు నేను, జ‌యం వంటి  ప్రేమ‌క‌థా చిత్రాల‌తో వ‌రుస విజయాల‌ను అందుకున్నాడు.