హరీష్ శంకర్ దర్శకత్వం లో 'సీటీమార్'

  • IndiaGlitz, [Thursday,February 22 2018]

'గ‌బ్బ‌ర్ సింగ్‌'తో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సూప‌ర్‌హిట్ చిత్రం 'దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'లోని 'సీటీ మార్ సీటీ మార్‌.. ' అనే సాంగ్ ఎంత పాపులార్ అయ్యిందో మ‌న‌కు తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన సినిమాలో హిట్ సాంగ్‌లోని 'సీటీమార్' అనే టైటిల్‌తో త్వ‌ర‌లోనే ఓ సినిమా తెరకెక్క‌నుండ‌టం విశేషం.

హరీష్ శంక‌ర్.. ప్ర‌స్తుతం దిల్‌రాజు బ్యాన‌ర్‌లో 'దాగుడుమూత‌లు' అనే సినిమాను రూపొందించే ప‌నిలో భాగంగా స్క్రిప్ట్ వ‌ర్క్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే 'జ‌వాన్' చిత్రాన్ని నిర్మించిన అరుణాచ‌ల్ క్రియేష‌న్స్ ప‌తాకంపై కొమ్మ‌ల‌పాటి కృష్ణ నిర్మాణంలో హీర‌ష్ శంక‌ర్‌ 'సీటీమార్‌' సినిమాను డైరెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో వ‌రుస హిట్స్ సాధిస్తున్న యువ క‌థానాయ‌కుడు ఈ సినిమాలో హీరోగా న‌టించనున్నారు.త్వ‌ర‌లోనే చిత్ర యూనిట్ పూర్తి వివ‌రాల‌ను తెలియ‌జేస్తుంది.

More News

తేజు చేతికి నాని చిత్రం...?

శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ వంటి హిట్ చిత్రాల‌ను నిర్మించిన సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తుంది. అందులో భాగంగా నేచుర‌ల్ స్టార్ నాని, కిశోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో ఓ సినిమా నిర్మించ‌డానికి సిద్ధ‌మైంది.

ప్రియా వారియ‌ర్‌కు సుప్రీమ్‌లో ఊర‌ట‌...

'ఒరు అదార్ ల‌వ్‌' అనే మ‌ల‌యాళ సినిమాలో న‌టించిన హీరోయిన్ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయ్యింది. అయితే ఆమెకు ఎంత ఫేమ్ వ‌చ్చిందో... అదెలా చిక్కులు కూడా వ‌చ్చి ప‌డ్డాయి.

చ‌ర‌ణ్ సినిమా బిజినెస్ క్రేజ్‌...

స్టార్ హీరోల సినిమాల‌కు సినిమా నిర్మాణం నుండే మంచి క్రేజ్ ఉంటుంది. సినిమా పూర్తి కాక‌ముందు అన్ని ఏరియాల బిజినెస్‌లు పూర్తవుతుంటాయి.

గోపీచంద్ చిత్రంలో మ‌రోసారి...

'ఆంధ్రుడు', 'య‌జ్ఞం', 'ల‌క్ష్యం', 'శౌర్యం', 'లౌక్యం' వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది గోపీచంద్ 25వ చిత్రం కావ‌డం విశేషం.

ముందుగానే 'కిరాక్ పార్టీ'

వ‌రుస విజ‌యాల‌తో, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ న‌టిస్తున్న చిత్రం 'కిరాక్ పార్టీ'.  ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సిమ్ర‌న్ ప‌ర్జీనా, సంయుక్త హెగ్డే క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.