హ‌ను రాఘ‌వ‌పూడి క‌వ‌చం ఎవ‌రితో..?

  • IndiaGlitz, [Saturday,February 13 2016]

అందాల రాక్ష‌సి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..తొలి ప్ర‌య‌త్నంలో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించ‌క‌పోయినా...అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యంగ్ డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి. తాజాగా నాని హీరోగా తెర‌కెక్కించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రంతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించి హ‌ను అంద‌రి దృష్టి ఆక‌ర్షించాడు. హ‌ను.. అందాల రాక్ష‌సి త‌ర్వాత రానా హీరోగా క‌వచం అనే యాక్ష‌న్ ఫిలిమ్ చేయాల‌నుకున్నారు.

ఈ సినిమా కోసం సంవ‌త్స‌రంన్న‌ర పాటు స్ర్కిప్ట్ వ‌ర్క్ చేసాడు. అయితే రానా బాహుబ‌లి లో బిజీగా ఉండ‌డంతో ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఇప్పుడు కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో స‌క్సెస్ సాధించ‌డంతో నెక్ట్స్ క‌వ‌చం సినిమాని చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. అలాగే త‌న త‌దుప‌రి చిత్రం కూడా 14 రీల్స్ బ్యాన‌ర్ లోనే ఉంటుంద‌ని ఎనౌన్స్ చేసాడు. అయితే క‌వచం లో హీరో ముందు అనుకున్న‌ట్టుగా రానా న‌టిస్తాడా..? లేక మ‌ళ్లీ నానితోనే చేస్తాడా అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

More News

'ఊపిరి' షూటింగ్‌ పూర్తి - మార్చిలో విడుదల

'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లో చేరిన కింగ్‌ నాగార్జున, 'ఆవారా' కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై 'బృందావనం' 'ఎవడు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు

దుబాయ్ గామా అవార్డ్స్ లో బాహుబలి దండయాత్ర

ఫిబ్రవరి 12, దుబాయి : ప్రతి సంవత్సరం దుబాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గామా ఆన్యువల్ టాలివుడ్ మ్యూజిక్ అవార్డ్స్ 3వ సంవత్సరంలో మరింత వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించింది గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్.

ముంబాయిలో ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్...

నాన్న‌కు ప్రేమ‌తో...సినిమాతో స‌క్సెస్ సాధించిన ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ జ‌న‌తా గ్యారేజ్ లో న‌టించేందుకు రెడీ అవుతున్నాడు.

ఫిబ్రవరి 14 న ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకోనున్న సునీల్ - వాసు వర్మ- దిల్ రాజు ల కృష్ణాష్టమి

చక్కటి డాన్సు ల తో, సూపర్బ్ కామెడీ టైమింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సునీల్ హీరో గా, వాసు వర్మ దర్శకత్వం లో ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న చిత్రం 'కృష్ణాష్టమి'.

జయం రవి సౌతిండియాలో పెద్ద స్టార్ కావాలి - నాని

జయం రవి, లక్ష్మిమీనన్ నటించిన తమిళ చిత్రం ‘మిరుథన్’ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న బ్యానర్ పై తెలుగలో ‘యమపాశం’ పేరుతో విడుదల చేస్తున్నారు. శక్తి సౌందరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ జరిగింది.