'గుంటూరు టాకీస్' ఆడియో ఆవిష్కరణ

  • IndiaGlitz, [Sunday,February 21 2016]

సిద్ధు జొన్నలగడ్డ, నరేష్‌ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్‌, శ్రద్ధాదాస్‌, లక్ష్మీ మంచు, మహేష్‌ మంజ్రేకర్‌ ప్రధాన తారాగణంగా ఆర్‌.కె.స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌కుమార్‌.ఎం నిర్మించిన చిత్రం గుంటూరు టాకీస్. మార్చి 4న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా డిజిటల్ ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా యూత్ కు సంబంధించిన కథ. ప్రవీణ్ సత్తార్ తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. సినిమా థియేటర్ రైట్స్ కొని విడుదల చేస్తున్న వారాహి చలనచిత్రం అధినేత సాయికొర్రపాటిగారికి థాంక్స్ అని నిర్మాత రాజ్ కుమార్ అన్నారు. ఎవరైనా నిర్మాతలు కావాలనుకుంటే ప్రొడ్యూసర్.కామ్ వెబ్ సైట్ ద్వారా ఈ సినిమాకు నిర్మాతలుగా మారే అవకాశాన్ని కలిగిస్తున్నాం.

సినిమాను కామన్ మ్యాన్ కు దగ్గరగా తీసుకెళుతున్నాం. సినిమా మార్చి 4న విడుదలవుతుంది. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో చిన్నమార్పును తీసకొస్తుందని నమ్ముతున్నాను, సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ అని దర్శకుడు ప్రవీణ్ సత్తార్ అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లరి నరేష్, యలమంచిలి సాయిబాబు, లక్ష్మీ మంచు, సీనియర్ నరేష్, సిద్ధు జొన్నలగడ్డ, రష్మీ, శ్రద్ధాదాస్, మధుర శ్రీధర్, రఘుకుంచె తదితరులు పాల్గొని యూనిట్ ను అభినందించారు.

సిద్ధు జొన్నలగడ్డ, రష్మి గౌతమ్, నరేష్, శ్రద్ధాదాస్, రాజా రవీంద్ర, రఘుబాబు, రవిప్రకాష్, అపూర్వ, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామిరెడ్డి, ఎడిటర్: ధర్మేంద్ర, మ్యూజిక్: శ్రీ చరణ్ పాకల, నిర్మాత: రాజ్ కుమార్.ఎం., కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.