త‌మ‌న్‌కు గ్రేట్ ఆఫ‌ర్‌?

అంత‌కు ముందు అర‌వింద స‌మేత‌, ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల‌తో మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ మ‌రో రేంజ్‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఓ డ‌జ‌ను సినిమాలు ఈ సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ చేతిలో ఉన్నాయి. కాగా.. ఇప్పుడు మ‌రో గొప్ప అవ‌కాశం వ‌చ్చినట్లు సినీ వ‌ర్గాల స‌మాచారం. అదేంటంటే ఓ పాన్ ఇండియా సినిమాకు త‌మ‌న్ సంగీతం అందించ‌బోతున్నార‌ని. ఇంతకూ త‌మ‌న్ సంగీతం అందించ‌నున్న పాన్ ఇండియా మూవీ ఏదో తెలుసా? ప‌్ర‌భాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం రాధేశ్యామ్‌. మ‌రి ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జూలియ‌స్ పేకియం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. కాగా ఇప్పుడు లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం త‌మ‌న్ .. రాధేశ్యామ్‌కు సంగీతం అందిస్తే ఓ పాట‌కు మ్యూజిక్ ఇస్తాడా? లేదా పూర్తి సినిమాకు సంగీతం అందిస్తాడా అనే విష‌యంపై ఇంకా క్లారిటీ లేదు.

యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిలో పూజా హెగ్డే హీరోయిన్‌. వ‌చ్చే నెల‌లో హైద‌రాబాద్లో వేసిన భారీ సెట్స్‌లో సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నారని టాక్. ఇప్ప‌టికే ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ బారీ షిప్ స‌హా ఓ పెద్ద మార్కెట్‌ సెట్ ను సిద్ధం చేసి ఉంచాడు. 2021లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

More News

రీమేక్ సినిమాకు త‌రుణ్ భాస్క‌ర్ మాట‌లు?

తొలి చిత్రం పెళ్ళిచూపులుతో హిట్ కొట్టి ద‌ర్శ‌కుడిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్‌.

పసిపాప ప్రాణం కోసం ఫ్లైట్‌లో తల్లిపాలు.. అసలు కథేంటంటే..

కనీసం నెల రోజులు కూడా నిండని పసికందు ప్రాణాన్ని నిలుపుకోవడం కోసం పాప తల్లిదండ్రులే కాదు..

తిరుమల ఆలయ పెద్ద జీయ్యంగార్‌కు కరోనా.. కీలక నిర్ణయం దిశగా టీటీడీ!

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ కరోనా విజృంభిస్తోంది. ఒక్క టీటీడీలోనే కరోనా కేసులు 150కి పైగా నమోదయ్యాయి.

మ‌హేశ్ డబుల్ ధ‌మాకా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ చిత్రం స‌ర్కారువారి పాట‌. ఈ ఏడాది సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రుతో మ‌హేశ్ సూప‌ర్‌హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే.

37 ఏళ్ల త‌ర్వాత ఆ బ్యాన‌ర్‌లో మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మించాల‌ని నిర్మాతలు భావిస్తుంటారు. ఆయ‌న చేసిన 150 చిత్రాల్లో చాలా మందినిర్మాత‌ల‌తో