ఆ ద‌ర్శ‌కుల‌కి ఓకే చెప్పిన గోపీచంద్‌

  • IndiaGlitz, [Wednesday,January 24 2018]

కుటుంబకథా చిత్రాల్లోనే మాస్, యాక్షన్ అంశాలను కూడా ఉండేటట్లు చూసుకునే క‌థానాయ‌కుడు గోపీచంద్. ఇటువంటి కథలతోనే ఒకప్పుడు వరుస హిట్లను అందుకున్న ఈ యాక్ష‌న్‌ హీరోకి.. 'లౌక్యం' త‌రువాత చేసిన సినిమాలేవీ విజ‌యాల‌ను అందించ‌లేక‌పోయాయి. ప్రస్తుతం డెబ్యు డైరెక్టర్ చక్రి దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని చేస్తున్నారు గోపీచంద్. మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని'బెంగాల్ టైగర్' నిర్మాత రాధామోహన్ నిర్మిస్తున్నారు.

ఇదిలా వుంటే...గోపీచంద్ మరో రెండు సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రచయిత నుంచి ద‌ర్శ‌కుడిగా మారి బిందాస్‌, ర‌గ‌డ‌, దూసుకెళ్తా వంటి విజ‌యాల‌ను అందుకున్న‌ వీరు పోట్లతో ఒక సినిమా చేయనున్నారు గోపీచంద్. ఈ సినిమాని 'సాహసం' నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించ‌నున్నార‌ని తెలిసింది. చక్రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ సినిమా తర్వాత ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అలాగే తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో కూడా గోపీ ఓ మూవీ చేయబోతున్నారు.

ఈ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని 'స్వామి రా రా', 'ఒక్క క్షణం' చిత్రాలను నిర్మించిన చక్రి చిగురుపాటి నిర్మించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుంద‌ని స‌మాచార‌మ్‌. మరి ఈ సినిమాలతోనైనా గోపీచంద్ విజయం అందుకుంటారేమో చూడాలి.

More News

నాగ్‌, నాని.. డేట్ ఫిక్స‌య్యింది

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్లీస్టార‌ర్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న‌ ఈ చిత్రంలో నాగార్జున డాన్ పాత్రలో కనిపించనుండగా...నాని డాక్టర్ పాత్రలో మెప్పించనున్నారని సమాచారం.  ఈ చిత్రాన్ని భ‌లే మంచి రోజు, శమంత‌క‌మ‌ణి చిత్రాల ద‌ర్శ‌కుడు శ్ĸ

ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా అనసూయ

డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న గాయత్రి చిత్రం ఫిబ్రవరి 9 న విడుదల కానుంది. సంక్రాంతికి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన రాగా, 'రాయలసీమ రామన్న చౌదరి' తరహాలో మోహన్ బాబు ఓ పవర్ఫుల్ రోల్ లో కనిపించనుండటంతో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.

బన్ని సినిమా ముందుకా? వెనక్కా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ వేసవిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు.

అడివిశేష్ , శివాని జంటగా ఫిబ్రవరిలో కొత్త చిత్రం ప్రారంభం

లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అడివి శేష్ హీరోగా ఓ కొత్త చిత్రం షూటింగ్ ఫిబ్రవరిలో

నిఖిల్ 'కిరాక్ పార్టీ' తొలి పాట‌... విడుద‌ల‌

వ‌రుస విజ‌యాల‌తో, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ న‌టిస్తున్న 15వ చిత్రం 'కిరాక్ పార్టీ'.  ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సిమ్ర‌న్ ప‌ర్జీనా, సంయుక్త హెగ్డే క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఏ టీవీ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై  రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర