'పంతం' ప్రీ-రిలీజ్ వేడుక డిటైల్స్‌..

  • IndiaGlitz, [Wednesday,June 27 2018]

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్, పంజాబి ముద్దుగుమ్మ‌ మెహరీన్ జంటగా నటించిన చిత్రం 'పంతం'. ఫర్ ఎ కాజ్ అన్నది ఉప శీర్షిక. గోపీచంద్ కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకి డెబ్యూ డైరెక్ట‌ర్‌ కె.చక్రవర్తి దర్శకత్వం వహించారు.

ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. గోపీ సుందర్ సంగీతం అందించిన పాటలు కూడా శ్రోతలను అలరిస్తున్నాయి. ఒక సోషల్ మెసేజ్‌తో ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకను ఈ నెల 30న హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించడానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంది. జూలై 5న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

'కన్నుల్లో నీ రూపమే' ఆడియో సక్సెస్ మీట్.....

ఎ.ఎస్.పి క్రియేషన్స్ పతాకంపై ఇరుసడ్ల రాజమౌళి సమర్పణలో భాస్కర్ బాసాని నిర్మాతగా, బిక్స్ ఇరుసడ్ల దర్శకుడిగా పరిచయమౌతున్న చిత్రం "కన్నుల్లో నీ రూపమే".

'డిస్కో రాజా'.. తండ్రీ కొడుకులుగా ర‌వితేజ‌

గత ఏడాది 'రాజా ది గ్రేట్'తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు మాస్ మహరాజా రవితేజ. అయితే.. ఆ త‌రువాత వ‌చ్చిన‌ 'టచ్ చేసి చూడు',

మ‌హేష్ సినిమాలో మ‌రోసారి..

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఉత్త‌రాది భామ‌ పూజా హెగ్డే జంటగా ఓ సినిమా రూపొందుతున్న‌ సంగ‌తి తెలిసిందే.

ఆస్కార్ ఆహ్వానం అందుకున్న భార‌తీయ తార‌లు...

ఆస్కార్ అవార్డుల‌ను ప్ర‌దానం చేసే ద అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్స్ అండ్ సైన్సెస్ సంస్థ కొత్తగా అవార్డులు ప్ర‌దానం చేయ‌డానికి 58 దేశాలు..

డ‌బ్బింగ్ చెప్పుకుంటున్న రాజ్ త‌రుణ్‌

'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21ఎఫ్' లాంటి  రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్‌ల‌తో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్.