పోస్ట్ పోన్ అయిన 'పంతం'...

  • IndiaGlitz, [Wednesday,March 28 2018]

యాక్షన్ హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన గోపీచంద్‌కు 'జిల్' (2015) సినిమాతో విజయాలకు బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన 'సౌఖ్యం', 'గౌతమ్ నంద', 'ఆక్సిజన్' చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బ‌తిన్నాయి.

ఈ పరాజయాలతో వెనుకబడిపోయిన‌ గోపీచంద్‌.. ప్ర‌స్తుతం నూత‌న‌ దర్శకుడు చక్రి ద‌ర్శ‌క‌త్వంలో 'పంతం' సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో ఎన్.ఆర్.ఐ. పాత్ర పోషిస్తున్నారు గోపీచంద్. ఆయ‌న‌ సరసన మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. గోపి సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రాధామోహన్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ వేసవి సందర్భంగా మే 18న విడుదల కావాల్సింది. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం సినిమాను జూన్ 22న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌టన వెలువ‌డ‌నుంది. 

More News

విలన్‌గా రాజశేఖర్..

ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ రూపొందనున్న విషయం తెలిసిందే.

మెట్రో ట్రైన్ లో నాగార్జున, నాని

కింగ్ నాగార్జున - నేచురల్ స్టార్ నాని హీరోలుగా ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ పతాకం

బ‌న్నికిది మ‌ర‌చిపోలేని రోజు

మార్చి 28, 2003.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో మ‌ర‌చిపోలేని రోజు ఇది.

వ‌ర్మ, అఖిల్ సినిమా క‌న్‌ఫ‌ర్మ్‌

రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని అఖిల్ సినిమా ఉంటుంద‌ని కొన్ని రోజుల క్రితం వార్త‌లు విన‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే.

ఏప్రిల్ మొద‌టివారంలో సుమంత్ 24 ఫ‌స్ట్‌లుక్‌

'మ‌ళ్ళీరావా' చిత్రంతో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చారు కథానాయకుడు సుమంత్.