గోపీచంద్ వద్దన్నాడు..బన్ని చేస్తున్నాడు

  • IndiaGlitz, [Saturday,March 12 2016]

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఇప్పుడు సరైనోడు చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. బొలివియాలో షూటింగ్ కూడా ముగిసింది. సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే బోయపాటి ఈ కథను వెంకటేష్ తో తులసి చేసిన టైంలోనే తయారుచేసుకున్నాడట. తులసి సినిమా తర్వాత గోపీచంద్ కు కథ వినిపించాడట.

అయితే గోపీచంద్ ఎందుకో వద్దనుకున్నాడు. దాంతో అప్పుడు ప్రాజెక్ట్ పక్కన పడింది. ఇప్పుడు అనే సబ్జెక్ట్ ను బన్నితో చేస్తున్నాడని ఫిలింనగర్ లో వార్తలు వినపడ్డాయి. మరి ఈ వార్తలపై బన్ని, బోయపాటి టీం ఎలా రియాక్ట్ అవుతారో తెలియడం లేదు.