'పంతం' లాంటి సోష‌ల్ కాజ్ ఉన్న మూవీని నా 25వ సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది - గోపీచంద్‌

  • IndiaGlitz, [Monday,June 25 2018]

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్‌, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.చక్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'. ఫ‌ర్ ఎ కాస్‌.. ఉప శీర్షిక‌. ఈ సినిమా జూలై 5న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను సోమ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో..

హీరో గోపీచంద్ మాట్లాడుతూ - మా సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన సురేంద‌ర్ రెడ్డిగారికి థాంక్స్‌. నేను ఏదైతే క‌థ‌ను న‌మ్మి సినిమా చేశానో.. అది రేపు నిజం కానుంది. సినిమా చేయ‌డానికి ముందు 'క‌థ బాగా చెప్పావ్‌.. అలాగే తీస్తావా' అని చ‌క్ర‌వ‌ర్తిని క‌థ చెప్పిన రోజున అడిగాను. త‌ను అవ‌కాశం ఇస్తే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని అన్నాడు. అన్న‌ట్లుగానే సినిమాను అద్భుతంగా చేశాడు.

ప్ర‌సాద్ మూరెళ్ళ‌, ర‌మేశ్‌రెడ్డిగారి నుండి ఈ క‌థ నాకు వ‌చ్చింది. మా నాన్న‌గారు చేసిన సినిమాల త‌రహాలో సినిమా చేయాల‌న‌కుంటున్న త‌రుణంలో నా 25వ సినిమాకు అలాంటి క‌థ కుద‌రడం ఆనందంగా ఉంది. నా 25వ సినిమాను మంచి సోష‌ల్ కాజ్ ఉన్న క‌మ‌ర్షియ‌ల్ మూవీగా చేశాను. పాట‌లు, టీజ‌ర్‌కి ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి. ట్రైల‌ర్‌తో పాటు సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని న‌మ్ముతున్నానుఅన్నారు.

సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ - పంతం.. ఫ‌ర్ ఎ కాజ్‌.. అనే యాప్ట్ టైటిల్‌గా ట్రైల‌ర్ చూస్తుంటే అనిపిస్తుంది. ట్రైల‌ర్‌లోని డైలాగ్స్ సినిమా ఎలా ఉండ‌బోతుంద‌న‌ని చెప్ప‌క‌నే చెబుతున్నాయి. సామాజిక స‌మ‌స్య‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించారు.

అలా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించిన సినిమాల‌న్నీ పెద్ద స‌క్సెస్‌ల‌య్యాయి. రాధామోహ‌న్‌గారు మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. ప్ర‌సాద్ మూరెళ్ల‌గారి అద్భుత‌మైన విజువ‌ల్స్ సినిమా ఎంత క్వాలిటీగా ఉండ‌బోతుందో చెబుతుంది. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు అని తెలిపారు.

కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ - మా బ్యాన‌ర్‌లో ఏడో సినిమా. గోపీచంద్‌గారి ప్రెస్టీజియ‌స్ 25వ సినిమా. నాకు అవ‌కాశం ఇచ్చిన గోపీచంద్‌గారికి థాంక్స్‌. చ‌క్ర‌వ‌ర్తిగారు కొత్త డైరెక్ట‌ర్ క‌దా.. ఎలా పిక్చ‌రైజ్ చేస్తారోన‌ని చిన్న డౌట్ ఉండేది. కానీ ఆయ‌న‌తో మూడు నాలుగు డిస్క‌ష‌న్స్ చేసిన త‌ర్వాత చాలా న‌మ్మ‌కం క‌లిగింది.

సినిమాను చాలా గొప్ప‌గా తెర‌కెక్కించారు. ప్ర‌సాద్‌గారు మంచి విజువ‌ల్స్ చేశారు. మెహ‌రీన్ ఐదో సినిమా ఇది. త‌ను న‌టించిన సినిమాల‌న్నీ విజ‌య‌వంత‌మైయాయి. ఈ సినిమా కూడా పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నాను. జూలై 5న సినిమాను విడుద‌ల చేస్తున్నాం అన్నారు.

డైరెక్ట‌ర్ కె.చ‌క్ర‌వ‌ర్తి మాట్లాడుతూ - టీజ‌ర్‌, పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను. సినిమాను పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం అన్నారు.

మెహ‌రీన్ మాట్లాడుతూ - సినిమాపై అంద‌రం చాలా పాజిటివ్‌గా ఉన్నాం. జూలై 5న విడుద‌ల కాబోయే సినిమా పెద్ద హిట్ అవుతుద‌నే కాన్ఫిడెన్స్ ఉంది అన్నారు.

More News

రాజ్ త‌రుణ్ 'ల‌వ‌ర్‌' ఆడియో ఆవిష్క‌ర‌ణ

తొలి చిత్రం 'ఊయ్యాల జంపాల‌'తో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్. వ‌రుస విజ‌యాల‌తో తెలుగు ప్రేక్ష‌కులదరికీ చాలా ద‌గ్గ‌ర‌య్యారు.

సుమంత్ 'ఇదం జగత్' ఫస్ట్ లుక్ విడుదల

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న కథానాయకుడు సుమంత్ నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం 'ఇదం జగత్'.

ప్ర‌భాస్.. ప‌దేళ్ళ త‌రువాత‌

బాహుబ‌లి సిరీస్‌తో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కెరీర్ గ్రాఫ్ ఒక్క‌సారిగా మారిపోయింది. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌భాస్‌.

నితిన్‌కు జోడీగా మ‌రోసారి..

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ప్ర‌స్తుతం శ్రీ‌నివాస క‌ళ్యాణం చిత్రంతో బిజీగా ఉన్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ‌త‌మానం భ‌వ‌తి ఫేమ్ స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కిస్తున్నారు.

విజేత సినిమా జులై 12న విడుదల - చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన విజేత సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి తో పాటు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి