హిమాలయాలలో గూఢచారి షూటింగ్

  • IndiaGlitz, [Monday,May 14 2018]

నటుడిగానే కాకుండా రచయితగా కూడా తన సత్తా చాటుకున్న అడివి శేష్ హీరోగా వస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం 'గూఢచారి'. చివరి షెడ్యూల్ గా ఓ భారీ యాక్షన్ సన్నివేశాలను హిమాచల్ ప్రదేశ్ లోని హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రవహించే ఓ మహానది పై నిర్మించిన ఎత్తైన మిలిటరీ వంతెన పై చిత్రీకరిస్తున్నారు.

అడివి శేష్ తోపాటు ప్రకాష్ రాజ్ మరియు ఇతర నటులు షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తిచేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. 'గూఢచారి' అమెరికా లోని మౌంట్ రైనియర్ మరియు ఇతర అందమైన లొకేషన్ లలో చిత్రీకరించబడింది.

న్యూ ఢిల్లీ, పూణే, చిట్టగాంగ్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడలలో సముద్రం మధ్యలో మరియు మంచు పర్వత ప్రాంతాలలో షూటింగ్ చేసారు. స్పై థ్రిల్లర్ గా వస్తున్నా ఈ చిత్రంతో శశికిరణ్ తిక్క దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అడివి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఉన్నత సాంకేతిక విలువలతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో సుప్రియ యార్లగడ్డ మళ్ళీ తెలుగు తెర పై కనిపించనున్నారు.

More News

అంగరంగ వైభవంగా సినీగోయర్స్ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక

49వ సినీ గోయర్స్ అసోసియేషన్ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక ఆదివారం హైదరాబాద్ లోని లలితకళాతోరణంలో అంగరంగ వైభవంగా జరిగింది.

మహానటి దర్శక, నిర్మాతలను సత్కరించిన అల్లు అరవింద్, అల్లు అర్జున్!

మహానటి ఘన విజయమైన సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్ కలిసి ఆదివారం చిత్ర దర్శక నిర్మాతలను సత్కరించారు.

రామ్‌, దిల్‌రాజు 'హ‌లో గురు ప్రేమ కోస‌మే'  ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నిర్మాణంలో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'హ‌లో గురు ప్రేమ కోస‌మే'.

నేడే కాశి ప్రీ రిలీజ్ ఈవెంట్

ఆల్ రౌండర్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎక్జాంపుల్ విజయ్ ఆంథోని. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకొంటూ.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న విజయ్ ఆంటోనీ

'స‌వ్య‌సాచి' యు.ఎస్‌. షెడ్యూల్ పూర్తి

నాగ చైతన్య, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'సవ్యసాచి'. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.