'హలో'.. అనూప్ మెప్పించాడు

  • IndiaGlitz, [Monday,December 11 2017]

జై చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన అనూప్ రూబెన్స్‌.. హ‌లో చిత్రంతో 50 చిత్రాల మైలురాయికి చేరుకున్నాడు. ఇష్క్‌, మ‌నం చిత్రాల త‌రువాత విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అనూప్ చేస్తున్న సినిమా ఇది. అఖిల్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు.

కాగా, ఆదివారం వైజాగ్‌లో ఈ చిత్రం ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. పాట‌లు విన్న‌వారంతా.. అనూప్ రూబెన్స్ కెరీర్‌లో మ‌నం త‌రువాత గుర్తుండిపోయే ఆల్బ‌మ్ గా హ‌లో నిలుస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. హ‌లో టైటిల్ సాంగ్‌, అన‌గ‌నగా ఒక ఊరు (రెండు వెర్ష‌న్‌లు), త‌ల‌చి త‌ల‌చి, ఏవేవో, మెరిసే మెరిసే.. ఇలా మొత్తం ఆరు పాట‌లున్న ఈ ఆల్బ‌మ్ విన‌గానే శ్రోత‌ల‌ను అల‌రించేలా ఉంది. ప్ర‌తి పాట‌లోనూ సాహిత్యం బాగా కుదిరింది. అలాగే అఖిల్ కూడా ఇందులో ఏవేవో అంటూ ఓ పాట పాడారు.

మొత్తానికి మ‌నం త‌రువాత అనూప్‌కి మ‌రో సూప‌ర్ ఆల్బ‌మ్ హ‌లో రూపంలో కుదిరింద‌నే చెప్పాలి.

More News

అల్లు శిరీష్ కి కూడా కలిసొస్తాడా?

మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన సంగీత దర్శకుడు అంటే మొదటగా వినిపించే పేరు మెలోడీ బ్రహ్మ మణిశర్మ.

వస్తున్నాం..బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం..ఇది ఫిక్స్ !! - కింగ్ నాగార్జున

అఖిల్ హీరోగా సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులను, సినీ ప్రేక్షకులను `హలో`అంటూ డిసెంబర్ 22న పలకరించబోతున్నారు యూత్ కింగ్ అఖిల్ అక్కినేని. ఈయన కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ సమర్పణలో 'మనం' ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక

రాజ‌మౌళి.. కుటుంబ‌క‌థా చిత్రం?

స్టూడెంట్ నెం.1 నుంచి బాహుబ‌లి 2 వ‌ర‌కు వ‌రుస విజ‌యాల‌తో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. బాహుబ‌లి సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని సంపాదించుకున్న రాజ‌మౌళి.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో మ‌ల్టీస్టార‌ర్ మూవీగా చేయ‌బోతున్నార‌ని చాలా రోజులుగా వారĺ

డ్యాన్స్ టీచ‌ర్‌గా రాశి ఖ‌న్నా

జై ల‌వ కుశ‌, ఆక్సిజ‌న్ చిత్రాల‌తో ఈ ఏడాది సంద‌డి చేసిన రాశి ఖ‌న్నా.. ప్ర‌స్తుతం ట‌చ్ చేసి చూడు, తొలి ప్రేమ చిత్రాల‌లో న‌టిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

'జై సింహా' సెన్సార్ డేట్ ఫిక్స‌య్యిందా?

నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన తాజా చిత్రం జై సింహా. సింహా, శ్రీ‌రామరాజ్యం చిత్రాల్లో బాల‌య్య‌కి జోడీగా న‌టించిన న‌య‌న‌తార ఈ చిత్రంలోనూ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు.