పవన్ ఫ్యాన్స్‌కు దిల్‌రాజు తియ్యటి శుభవార్త..

  • IndiaGlitz, [Sunday,February 09 2020]

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండేళ్ల తర్వాత ముఖానికి రంగేసుకున్న సంగతి తెలిసిందే. ‘పింక్’ రీమేక్ సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న ఆయనపై దర్శకనిర్మాతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు.. ఆయనకు కావాల్సిన సకల సౌకర్యాలు అనగా.. ఫ్లైట్ మొదలుకుని అన్ని కల్పించారు. ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొన్న పవన్ తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ సగం వరకు కంప్లీట్ చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అంతేకాదు.. అసలు పవన్ సినిమా చేస్తున్నాడా లేదా..? అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. ఇటీవల పవన్ లాయర్ డ్రస్‌లో ఓ పిక్.. ఆ తర్వాత ఓ డైలాగ్ ఉన్న 20 సెకన్ల వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమవ్వడంతో అభిమానులు ఆనంద పడగా.. చిత్రబృందం మాత్రం లీకులతో అసంతృప్తికి లోనైంది.

తియ్యటి శుభవార్త..!

ఇదిలా ఉంటే.. తాజాగా నిర్మాత దిల్ రాజు.. పవన్ వీరాభిమానులకు తియ్యటి శుభవార్త చెప్పాడు. ‘పింక్’ రీమేక్ సంబంధించి ప్రస్తుతం ఇంకా షూటింగ్ జరుగుతోందని తెలిపాడు. మార్చిలో పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని.. మేలో వేసవి సందర్భంగా సినిమాను రిలీజ్ చేస్తామని స్పష్టం చేశాడు. ఈ వార్త విన్న పవన్ వీరాభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మేలో మా పవర్‌స్టార్ వచ్చేస్తున్నాడంటూ అభిమానులు నెట్టింట్లో రాసేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. యంగ్ హీరో శర్వానంద్, సమంత నటీనటులుగా సి. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన రీమేక్ చిత్రం ‘జాను’ జనవరి-07న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్రబృందం అంతా కాలినడకన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకుంది. దర్శనాంతరం మీడియాతో మాట్లాడిన దిల్‌రాజు.. పవన్ ‘పింక్’ రీమేక్ గురించి పై వ్యాఖ్యలు చేశాడు.

More News

శ్రీరాముడిపై ‘కత్తి’ అనుచిత వ్యాఖ్యలు.. మళ్లీ బహిష్కరణ తప్పదా!!

సినీ క్రిటిక్ కత్తి మహేశ్ గురించి ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు. రోజుకు మూడు వివాదాలు.. ఆరు తిట్లు ఇదే జీవితంగా బతికేస్తుంటాడు.! అంతేకాదు సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఎవర్నీ వదలకుండా తనదైన శైలిలో

ర‌జినీ పొలిటిక‌ల్ పార్టీకి ముహూర్తం కుదిరింది!

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ సినిమాల నుండి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌బోతున్నారనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే ర‌జినీకాంత్ తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్పారు కానీ..

నూర్ కుటుంబానికి చెర్రీ 10 లక్షల ఆర్థిక సాయం.. భరోసా

మెగాహీరోలను.. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రాణంగా అభిమానించే హైదరాబాద్‌కు చెందిన వీరాభిమాని నూర్ మహ్మద్ డిసెంబర్-8న మృతి చెందిన విషయం తెలిసిందే. సిటీ చిరంజీవి

‘కేజ్రీ’కే ఢిల్లీ కిరీటం.. తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ఇవాళ జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటి వరకూ 58 శాతం పోలింగ్‌ నమోదయ్యింది.

బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదా.. మాకు ఫిర్యాదు చేయండి!

న్యూ ఢిల్లీ: బ్యాంకుల్లో రుణాలు ఇవ్వట్లేదని జనాలు నానా తంటాలు పడుతుంటారు.