కువైట్‌లో ఉంటున్న భారతీయులకు శుభవార్త..

  • IndiaGlitz, [Saturday,May 02 2020]

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో స్వరాష్ట్రాలను వదిలి ఇతరదేశాలకు, రాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇంటికెళ్లలేక.. అక్కడ ఉండలేక నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్న వలసకూలీలను స్వరాష్ట్రాలకు చేర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఈ తరుణంలో కువైట్‌లో ఉన్న భారతీయులపై కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో కువైట్‌లో ఉంటున్న భారతీయులకు శుభవార్త తెలిపింది.

కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే..

కువైట్‌లో ఉంటున్న వారిని భారత్‌కు పంపేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత ప్రభుత్వం ఆమోదం కోసం అక్కడి ప్రభుత్వం వేచి చూస్తోంది. కేంద్ర నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయనుంది. ఇప్పటికే కేంద్రం.. రక్షణ విమానాలను భారీ బందోబస్తుతో సిద్ధం చేసింది. ఏ క్షణంలో అయినా కువైట్‌తో పాటు గల్ఫ్‌కు విమానాలు తరలివెళ్లనున్నాయి. ఈ క్రమంలో స్వదేశాలకు వెళ్లేందుకు లక్షలాది మంది భారతీయులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇప్పటికే కువైట్‌లోని పలు ఎయిర్‌పోర్టుల్లో భారతీయులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇంకొంత మంది చేరుకుంటున్నారు. మొదట అక్కడే భారతీయులకు పరీక్షలు చేసి ఆ తర్వాత విమానం ఎక్కించి మరోసారి ఇండియాకొచ్చిన తర్వాత పరీక్షలు చేయనున్నారు. రెండోసారి టెస్ట్‌లన్నింటినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చేయించనున్నాయి.

వీరికి కూడా చాన్స్ ఉందా..!?

అయితే కువైట్‌లో ఇళ్లలో పనికోసం వెళ్లిన వారు.. అక్కడ పనులు దొరక్క బయట ఇబ్బంది పడుతున్నవారిని కూడా పంపుతున్నారా..? లేకుంటే అక్కడ ఉద్యోగం వెళ్లిన వారు కూడా ఇండియాకు తరలిస్తున్నారా..? అనేదానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. దీనిపై స్పష్టత కోసం అక్కడున్న మరికొంత మంది భారతీయులు వేచి చూస్తున్నారు. ఇవన్నీ అటుంచితే.. అక్కడ ఇళ్లలో పనులకెళ్లిన వారు ఇంటి యజమానులు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక పాస్ పోర్టులు వదిలేసి బయటికి వచ్చి సిమెంట్ పని ఇంకా టీ కొట్లు, సూపర్ మార్కెట్లలో పనిచేస్తున్న వారి సంగతేంటి..? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ అందర్నీ తరలిస్తున్నారా అనేది తెలియరాలేదు.

More News

‘బొమ్మరిల్లు’ భాస్కర్‌కు బన్నీ బంపరాఫర్..!

లవర్ బాయ్ సిద్ధార్థ్, జెనీలియా నటీనటులుగా వచ్చిన ‘బొమ్మరిల్లు’ చిత్రం ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా హిట్టయిన తర్వాత సినిమా తెరకెక్కించిన భాస్కర్ తన ఇంటిపేరునే

వైద్యులు సూపర్ హీరోలు.. : మహేశ్ బాబు

కరోనా మహమ్మారిపై ముందుండి ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ప్ర‌భాస్ 21... క‌థ సిద్ధం చేసి నాగ్ అశ్విన్‌

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అదే స‌మ‌యంలో త‌న 21వ సినిమాను నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌డానికి

'ఆచార్య‌'పై కాజ‌ల్ క్లారిటీ..!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు. నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు. షూటింగ్ ద‌శ‌లోఉన్న స‌మయంలో క‌రోనా రావ‌డం..ఫ‌లితంగా షూటింగ్ ఆగ‌డం జ‌రిగిపోయాయి.

చ‌ర‌ణ్‌పై చిరు ఫ‌న్నీ కామెంట్‌

కొడుకు చ‌ర‌ణ్‌ను ఉద్దేశించి మెగాస్టార్ చిరంజీవి ఓ ఫ‌న్నీ కామెంట్ చేశాడు. అది కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా... సోష‌ల్ మీడియాలో చేసిన కామెంట్ కాబ‌ట్టి ఎంత స్పీడుగా