వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల శుభవార్త.. పెండింగ్ చలానాలు చెల్లిస్తే డిస్కౌంట్, ఎంతంటే..?

  • IndiaGlitz, [Wednesday,February 23 2022]

హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్, సీటు బెల్ట్ లేకుండా కారు నడపడం వంటి విషయంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వుంటున్న సంగతి తెలిసిందే. పరిమితికి మించి చలానాలు కట్టని వారి వాహనాలను సీజ్ చేయడం, చివరికి కేసుల వరకు వ్యవహారం వెళుతోంది. ఈ నేపథ్యంలో పెండింగ్ చలానాల విషయంలో వాహనదారులకు శుభవార్త చెప్పారు హైదరాబాద్ పోలీసులు.

భారీ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న చలానాలు కట్టేందుకు వీలుగా రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నిబంధనల ఉల్లంఘనలపై ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తున్నా కొందరు చెల్లిస్తుంటే.. మరి కొందరు మాత్రం వదిలేస్తున్నారు. దీనిపై కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. గత ఎనిమిదేళ్లుగా వాహనదారులు చెల్లించని జరిమానా రూ.600 కోట్లకు చేరింది.

కరోనా వైరస్‌ ప్రభావంతో గత రెండేళ్లుగా ప్రజల ఆర్ధిక పరిస్ధితులు దిగజారిపోయాయి. ప్రభుత్వం సైతం ఈ విషయంలో మినహాయింపు కాదు. ఈ క్రమంలోనే పెండింగ్‌ ట్రాఫిక్‌ చలానాలపై అధికారులు దృష్టి సారించారు. ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు, బస్సులపై ఉన్న పెండింగ్‌ చలాన్లు రాయితీపై చెల్లించే అవకాశం కల్పిస్తూ అధికారులు దస్త్రం సిద్ధం చేశారు. దీనిని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి పంపించాలని నిర్ణయించారు.

అయితే, డీజీపీ మహేందర్‌రెడ్డి మెడికల్ లీవ్‌పై రెండు వారాలపాటు సెలవుపై వెళ్లడంతో దస్త్రం పెండింగ్‌లో ఉంది. ఆయన తిరిగి విధుల్లో చేరగానే రాయితీపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే, ఎంత మేర రాయితీ ఇస్తారనే దానిపై క్లారిటీ లేదు. ద్విచక్ర వాహనదారులకు 75 శాతం, కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30శాతం రాయితీ ఇచ్చి.. ఆన్‌లైన్‌, మీసేవా కేంద్రాల ద్వారా చెల్లించేందుకు అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More News

అధికారిక లాంఛనాలతో ముగిసిన గౌతంరెడ్డి అంత్యక్రియలు.. తరలివచ్చిన ప్రజానీకం

గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి.

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పోలీసుల సూచనలు విన్నారా..?

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్, రానా కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘భీమ్లా నాయక్‌’. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రభాస్ కోసం అమితాబ్ .. రాధేశ్యామ్ కోసం గొంతు సవరించిన బిగ్‌బి

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' హిందీ వెర్షన్కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్

అంటే సుందరానికి: నాని పుట్టినరోజు స్పెషల్..  రేపు ‘‘బర్త్ డే హోమం’’

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేకుండా వున్న నేచురల్ స్టార్ నానీ  ‘‘శ్యామ్ సింగరాయ్’’ విజయంతో మంచి జోష్‌లో వున్నారు.

భీమ్లా నాయక్ ఎఫెక్ట్ : మరోసారి వాయిదాపడ్డ వరుణ్ తేజ్ ‘‘గని’’ .. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.