జెనీలియా దంప‌తుల విరాళం

  • IndiaGlitz, [Tuesday,August 13 2019]

బాలీవుడ్ హీరో, మాజీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు రితేష్ దేశ్‌ముఖ్‌, జెనీలియా దంప‌తులు త‌మ పెద్ద మ‌న‌సుని చాటుకున్నారు. మ‌హారాష్ట్ర‌లో ముంబై న‌గ‌రం స‌హా ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జలు వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. వీరిని ప్ర‌భుత్వం ఆదుకుంటుంది. ప్ర‌భుత్వానికి తమ వంతు సాయంగా రితేష్‌, జెనీలియా దంప‌తులు 25ల‌క్ష‌ల రూపాయ‌ల అందించారు. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ను క‌లిసి వీరు చెక్‌ను అందించారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫ‌డ్నవీస్ వారితో క‌లిసి దిగిన ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

''మ‌హారాష్ట్ర స‌హా దేశంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద‌ల కార‌ణంగా ప్ర‌జలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ‌ర‌ద‌ల‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు న‌న్ను, జెనీలియా క‌దిలించాయి. అందుక‌నే మా వంతుగా దేశ్ ఫౌండేష‌న్ త‌ర‌పున పాతిక ల‌క్ష‌లు విరాళం అందిస్తున్నాం. అంద‌రూ త‌మ వంతుగా సాయం చేయాల‌ని కోరుకుంటున్నాం. మ‌న‌మంతా క‌లిస్తే ఎంతో సాధించ‌వ‌చ్చు'' అని రితేష్ దేశ్‌ముఖ్ తెలిపారు.