ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా జెమిని కిరణ్

  • IndiaGlitz, [Monday,July 31 2017]

తెలుగు చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి(తెలుగు ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌) అధ్య‌క్షుడిగా ప్ర‌ముఖ నిర్మాత ప‌ర్వ‌త‌నేని కిర‌ణ్‌(జెమిని కిర‌ణ్‌) ఎంపిక‌య్యారు. ఆదివారం జ‌రిగిన నిర్మాత‌ల ఎన్నిక‌ల్లో ప్రొడ్యూస‌ర్స్ సెక్టార్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ సెక్టార్‌, ఎగ్జిబిట‌ర్స్ సెక్టార్‌, స్టూడియో సెక్టార్ స‌భ్యులు పాల్గొన్నారు. స్వతంత్ర్య అభ్య‌ర్థిగా పోటీ చేసిన ప్ర‌తాని రామ‌కృష్ణా గౌడ్ విజ‌యం సాధించారు.

ఈసారి అధ్యక్ష బాధ్య‌త నిర్మాత‌కు ద‌క్క‌డంతో వారిలో జెమినికిర‌ణ్ ఫిలించాంబ‌ర్ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. చాంబ‌ర్ ఉపాధ్య‌క్షులుగా వి.వీరినాయుడు, కె.బ‌సిరెడ్డి, శ్రీనివాస‌బాబు ఎన్నిక‌య్యారు. త‌మ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్యనారాయ‌ణ కోశాధికారిగా ఎన్నిక‌య్యారు.